New Twist in MP Gorantla Madhav Video Episode: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్.. ఆ రిపోర్ట్ ఫేక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న లేఖ ఒరిజనల్ కాదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేయడంతో మరోసారి దీనిపై చర్చ తెరపైకి వచ్చింది.. దీనిపై ఏపీ సీఐడీ పెట్టిన మెయిల్ కు సంబంధిత ల్యాబ్ నుంచి వివరణ వచ్చిందని చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై దుమారం రేగింది.. ఆ వీడియో మార్ఫింగ్ అని ఎంపీ మాధవ్ స్పష్టం చేశారని తెలిపారు.. ఇదే సమయంలో ప్రైవేట్ ల్యాబ్లకు సంబంధించిన నివేదికలు చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. ఎక్లిప్స్ ల్యాబ్ పేరుతో కొందరు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలిందన్న ఆయన.. ఎక్లిప్స్ సంస్థకి చెందిన జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతోన్న నివేదిక తనది కాదని స్టాఫర్డి నాకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారని వెల్లడించారు.
Read Also: AP CID Live: AP CID Briefs Media Over MP Gorantla Madhav Video Call Case
Also Read
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
సర్కులేషన్లో ఉన్న వీడియో ఒరిజనలేనని మాత్రమే ఎక్లిప్స్ సంస్థ చెప్పింది… కానీ, ఓ స్క్రీన్ మీద రన్ అవుతున్నదాన్ని తీసిన వీడియో చూసి రియలా..? ఫేకా..? అనేది ఎవ్వరూ తేల్చలేరని స్పష్టం చేశారు సునీల్ కుమార్.. ఒరిజనల్ ఫుటేజ్ ఉంటేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని జిమ్ స్టాఫర్డ్ కూడా చెప్పారన్న ఆయన.. తానిచ్చిన నివేదికలో మార్పులు చేర్పులు చేయాల్సిందిగా పోతిని తనను కోరారని జిమ్ స్టాఫర్డ్ స్వయంగా చెప్పారంటూ మరో బాంబ్ పేల్చారు.. ఇక, ఫేక్ డాక్యుమెంట్ సర్కులేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రసాద్ పోతిని సహా తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఐటీ యాక్ట్ 67 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నుంచి నోటీసులు వచ్చాయా..? లేదా..? అనేది డీజీపీనే అడగాలని.. ఆయనే చెబతారని తెలిపారు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!