Coins worth Rs 11 crore missing: బ్యాంకులో చిల్లర మాయం.. రంగంలోకి సీబీఐ.. 25 ప్రాంతాల్లో సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో చిల్లర మాయమైంది.. రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. ఏకంగా 25 ప్రాంతాల్లో సోదాలు జరిపింది.. చిల్లర మాయం కావడం ఏంటి? ఆ కేసులో సీబీఐ ఎంట్రీ ఇవ్వడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. చిల్లర అంటే.. పావులో.. పరకో కాదండి.. ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణెలు గల్లంతయ్యాయి.. అది కూడా బ్యాంకులో నుంచి.. దీంతో, సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది..
Read Also: Power Purchases Telangana: డిస్కంలపై నిషేధం.. రాష్ట్రాల్లో కరెంట్ కోతలు..?
Also Read
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
రాజస్థాన్లోని కరౌలీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. తాజాగా, అంటే గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఏజెన్సీ.. ఏప్రిల్ 13న కేసు నమోదు చేసిందని వారు తెలిపారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయపూర్ మరియు భిల్వారాలోని 25 ప్రాంతాల్లో ఏకకాలంలో.. 15 మంది మాజీ బ్యాంకు అధికారులు మరియు ఇతరుల ప్రాంగణాల్లో సోదాలు జరిపినట్టు వెల్లడించారు.. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్.. ఆగస్టు 2021లో తన నగదు నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. తర్వాత డబ్బు లెక్కింపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ లెక్కింపులోనే అసలు విషయం వెలుగు చూసింది. కౌంటింగ్ను ఓ ప్రైవేట్ వెండర్కు అప్పగించగా, బ్రాంచ్లో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైనట్లు తేలింది. దాదాపు రూ. 2 కోట్లతో కూడిన 3,000 నాణేల సంచులకు మాత్రమే లెక్కలు చూపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నాణేల శాఖకు బదిలీ చేశారు. మిగతా చిల్లర ఎటు పోయింది అని తేల్చేపనిలో సీబీఐ పడిపోయింది.
తాజావార్తలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!