Coins worth Rs 11 crore missing: బ్యాంకులో చిల్లర మాయం.. రంగంలోకి సీబీఐ.. 25 ప్రాంతాల్లో సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో చిల్లర మాయమైంది.. రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. ఏకంగా 25 ప్రాంతాల్లో సోదాలు జరిపింది.. చిల్లర మాయం కావడం ఏంటి? ఆ కేసులో సీబీఐ ఎంట్రీ ఇవ్వడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. చిల్లర అంటే.. పావులో.. పరకో కాదండి.. ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణెలు గల్లంతయ్యాయి.. అది కూడా బ్యాంకులో నుంచి.. దీంతో, సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది..
Read Also: Power Purchases Telangana: డిస్కంలపై నిషేధం.. రాష్ట్రాల్లో కరెంట్ కోతలు..?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
రాజస్థాన్లోని కరౌలీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. తాజాగా, అంటే గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఏజెన్సీ.. ఏప్రిల్ 13న కేసు నమోదు చేసిందని వారు తెలిపారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయపూర్ మరియు భిల్వారాలోని 25 ప్రాంతాల్లో ఏకకాలంలో.. 15 మంది మాజీ బ్యాంకు అధికారులు మరియు ఇతరుల ప్రాంగణాల్లో సోదాలు జరిపినట్టు వెల్లడించారు.. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్.. ఆగస్టు 2021లో తన నగదు నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. తర్వాత డబ్బు లెక్కింపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ లెక్కింపులోనే అసలు విషయం వెలుగు చూసింది. కౌంటింగ్ను ఓ ప్రైవేట్ వెండర్కు అప్పగించగా, బ్రాంచ్లో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైనట్లు తేలింది. దాదాపు రూ. 2 కోట్లతో కూడిన 3,000 నాణేల సంచులకు మాత్రమే లెక్కలు చూపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నాణేల శాఖకు బదిలీ చేశారు. మిగతా చిల్లర ఎటు పోయింది అని తేల్చేపనిలో సీబీఐ పడిపోయింది.
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!