తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.. […]
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు సంబంధించిన వాట్సాప్ వీడియో కాల్ లీక్ పెద్ద కలకలం సృష్టించింది.. దానిపై ఫోరెన్సిక్ నివేదికలు.. దానికి కౌంటర్లు.. ధర్నాలు, ఆందోళనలు.. ఇలా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రచ్చే జరిగింది.. అయితే.. అ విషయంపై ఇవాళ స్పందించారు.. ఏజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుప్పంలో జరిగిన ఘటనలపై సమీక్ష జరుగుతోంది… కుప్పం ఘటనలు మరీ పెద్దవి కాదు… లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా […]
నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిద్ధమవుతోంది… గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదలపై వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం నిర్వహించింది.. గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కింద 663 ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. దాదాపు 50 డిపార్ట్మెంట్లలో గ్రూప్-III సర్వీసెస్ రిక్రూట్మెంట్ కింద 1373 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో.. […]
నెల రోజుల పాటు ఏసీ బస్సుల ఛార్జీల్లో డిస్కౌంట్ తీసుకొచ్చింది... ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గించింది ఆర్టీసీ.. ఏసీ బస్సుల ఛార్జీలో 20 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన […]
వినియోగదారుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎడిట్ బటన్ను పరీక్షిస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది.. మైక్రో బ్లాగింగ్ సైట్ ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపింది. "మీరు ఎడిట్ చేసిన ట్వీట్ను చూసినట్లయితే, మేము ఎడిట్ బటన్ను పరీక్షిస్తున్నందున ఇది జరుగుతుంది" అని కంపెనీ ట్వీట్లో పేర్కొంది.
కొన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపణలు ఉన్నాయి.. అందులో పోలీసు డిపార్ట్మెంట్పై కూడా విమర్శలు ఉన్నాయి.. ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఆఫీసర్ల వరకు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి.. అయితే, ఓ కానిస్టేబుల్.. ఏకంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కే దమ్కీ ఇచ్చాడు.. సివిల్ డ్రెస్లో ఉన్న ఆయన్ను గుర్తుపట్టలేకపోయిన ఆ కానిస్టేబుల్.. ముందు రూల్స్ మాట్లాడాడు.. చలానా రాయమంటారా? అంటూ డీసీపీని బెదిరించాడు ట్రాఫిక్ […]
ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా […]
టెక్నాలజీ యుగంలో ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో నచ్చిన యాప్లతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్లు ఉండాల్సింది.. అందులో మరీ ముఖ్యంగా వాట్సాప్ ఉంటేనే రోజు గడిచేది.. మెసేజ్ చేయాలన్నా.. వాయిస్ మెసేజ్ పెట్టాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా.. వాయిస్ కాల్ చేయాలన్నా.. చివరకు వీడియో కాల్ చేయాలన్నా.. ఇప్పుడు వాట్సాప్పై ఆధారపడిపోతున్నారు.. ప్రతీ యూజర్ ఈజీగా వాట్సాప్ వాడేస్తున్నారు.. అయితే, వాట్సాప్ వినియోగదారులారా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. కొన్ని పాత ఐఫోన్లకు […]
గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ […]