Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Jp Nadda At Karimnagar Bjp Public Meeting

JP Nadda: సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే..

Published Date :December 15, 2022 , 7:28 pm
By Sudhakar Ravula
JP Nadda: సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సమయం ఆసన్నమైంది.. కేసీఆర్‌ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్ మీకు దొరికాడా? లేడా? అని ప్రశ్నించారు. పాదయాత్ర 1403 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చింది.. ఇక్కడితో ఆగేది కాదు ఈ యాత్ర.. ప్రజల గోసకు బీజేపీ భరోసా కల్పిస్తుందన్నారు.. సాలు దొర.. సెలవు దొర పక్కా అంటూ జోస్యం చెప్పారు.

Read Also: CM YS Jagan: మైల’వరం’పై జగన్‌ ఫోకస్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు..

ఇక, నేను వచ్చేటప్పుడు నా పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్‌ శ్రేణులపై ఫైర్‌ అయ్యారు జేపీ నడ్డా.. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేశారన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం ‘అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక’ ప్రభుత్వం.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు.. సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోడీ పాలనలోనే జరిగింది.. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామన్న ఆయన.. జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చాం.. కానీ, మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు.. కేసీఆర్ పాలనలో రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుంది అని ఎద్దేవా చేశారు.. టీఆర్ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన కేసీఆర్ పార్టీకి నెక్స్ట్ బీఆర్‌ఎస్‌ తప్పదని జోస్యం చెప్పారు.. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకున్నాడా? అని నిలదీశారు జేపీ నడ్డా.

తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్ లూఠీ చేస్తున్నాడని ఆరోపించారు జేపీ నడ్డా.. “ధరణి పోర్టల్” పేరుతో.. బీఆర్ఎస్‌ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారన్న ఆయన.. అసదుద్దీన్‌ ఒవైసీకి భయపడే.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేసీఆర్ జరపడం లేదన్నారు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జరిపిందని గుర్తుచేశారు. ఇక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఏమైంది? వెల్నెస్ సెంటర్ల పేరును బస్తీ దవాఖానగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు.. వెల్నెస్ సెంటర్ లకు బస్తీ ధవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. బస్తీ ధవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్న ఆయన.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి.. తెలంగాణ అభివృద్ధి ని కోరుకునే ప్రతి ఒక్కరూ.. బీజేపీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాదయాత్రలు ఆగవు.. పాదయాత్రలు ఇంకా కొనసాగుతాయి. ప్రతి గడిపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తాం.. తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయం.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp public meeting
  • BRS
  • cm kcr
  • jp nadda

తాజావార్తలు

  • New Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్.. సెంటర్‌కు వెళ్లకుండానే ఫోన్ నంబర్ మార్చుకోండిలా!

  • CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

  • Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..

  • AP Inter Results 2026: నిరీక్షణకు తెర.. రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..!

  • Redmi R70m 5G: రెడ్‌మీ R70m 5G రిలీజ్.. 6,300mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions