CM YS Jagan: మైల’వరం’పై జగన్ ఫోకస్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైలవరం పంచాయితీ హాట్టాపిక్గా సాగుతూ వచ్చింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తూనే ఉంది.. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.. ఇప్పటికే వైసీపీ అధిష్టానం వారిని సముదాయించే ప్రయత్నాలు చేసింది.. ఇక, పార్టీ అధినేత, సీఎం జగన్ వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో.. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికల దిశగా సన్నద్ధం చేస్తూనే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పలు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇక, ఇవాళ మైలవరం వంతు వచ్చింది. మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సీఎం జగన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Delivery In Plane Washroom : ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే బిడ్డకి విమానంలో జన్మనిచ్చిన మహిళ
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
గడప గడప కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి నాలుగు నెలలు పైనే అయ్యింది.. మైలవరం నియోజకవర్గంలో 89 శాతం ఇళ్లకు సంక్షేమం అందించామని తెలిపారు సీఎం జగన్.. ఈ మూడున్నర ఏళ్ళల్లో మైలవరం నియోజకవర్గంలో 900 కోట్లకు పైగా లబ్ది జరిగిందన్న ఆయన.. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లే అడుగులు వేగంగా వేస్తున్నాం.. ఇళ్ల దగ్గరకు వెళ్లే సరికే వారి ఆధార్ కార్డ్ నెంబర్ తో సహా చెప్పగలుగుతున్నాం.. ఇంత మేలు చేయగలిగాం అని దైర్యంగా చెప్పగలుగుతున్నామన్నారు.. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆశ్వీరిందించండి అని అడుగ గలుగుతున్నాం.. ఇతర కారణాలతో సంక్షేమం అందని వారికి కూడా గడప గడప ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని వెల్లడించారు. ఇక, జనవరి నుంచి బూత్ కమిటీల నియామకం చేపట్టనున్నట్టు తెలిపారు.. బూత్ కమిటీలో ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నాం.. ముగ్గురు సభ్యుల్లో కచ్చితంగా ఒక మహిళ కూడా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం.. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, ఒక తమ్ముడు గృహ సారధులను నియమిస్తున్నామని ప్రకటించారు.
ఇక, గృహ సారధులు, సచివాలయ కమిటీ కన్వీనర్లు రానున్న 16 నెలలు ఇంటింటికి వెళ్లాలి.. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలి.. ప్రతి పథకం అందుతుందా లేదా అన్నది పరిశీలించాలని అని స్పష్టం చేశారు సీఎం జగన్.. అందరూ కలిసి నిజమైన లబ్దిదారులకు ప్రతి పథకం అందేలా చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఈ కార్యక్రమం జనవరి నుంచి మరింత వేగవంతంగా జరగాలని స్పష్టం చేశారు.. ఈసారి మన టార్గెట్ 175 నియోజకవర్గాలు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం.. అది నాఒక్కడితో సాధ్యం కాదు.. మనం అందరం కలిస్తేనే టార్గెట్ పూర్తి చేయగలం అని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, మైలవరంలో నేతల మధ్య వార్, గ్రూపుల తలనొప్పిగా మారడంతో.. గ్రౌండ్ లెవల్లో.. కార్యకర్తల పరిస్థితి ఏంటి? అనే దానిపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్పెట్టినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..