Maheshwar Reddy: ఎంత గొప్ప నేత అయినా.. మాజీ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు వస్తోంది? అని ప్రశ్నించిన ఆయన.. కోవర్టులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరగాలన్నారు.. పార్టీ పగ్గాలు తీసుకున్న నాయకుడు అందరిని కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటే కోవర్టులు అనే చర్చ రాదని.. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే ఇలాంటి చర్చలు వస్తాయన్నారు.
Read Also: Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్ఎస్ భరతం పడతాం..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ఇక, పార్టీలో అందరూ కోరుకునేది ఆత్మభిమానమే అన్నారు మహేశ్వర్రెడ్డి.. ఎవరూ పీసీసీని తీసేయండి అని అనడం లేదు.. కోవర్టులు అనే నిందలు వేయడం కంటే.. ప్రత్యర్థులపై ఎందుకు కొట్లాడటం లేదు ? అని ప్రశ్నించారు. అందరం కలిసి పని చేసి.. అధికారంలోకి రావాలనే అజెండా ఉండాలన్న ఆయన.. పదవులు శాశ్వతం కాదు.. ఎంత గొప్ప నాయకుడు అయినా మాజీ అవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆత్మభిమానం చంపుకుని ఎవరు పని చేయరు.. కోవర్టులు ఉంటే బయటకు పంపాలి.. ఆధారాలు ఉంటేనే అంటారు కదా.. దామోదర రాజనర్సింహ ఆధారాలు లేకుండా అనరు కదా ? అని ఎదురు ప్రశ్నించారు. మరోవైపు, బలాబలాలు ప్రదర్శించుకోవడానికి అధికారంలో లేమని హితవుపలికిన ఆయన.. బలప్రదర్శన ఎన్నికల్లో చూపించుకోవాలి.. కమిటీలో చూపించుకుంటే ఏం లాభం? అని ఎద్దేవా చేశారు.. అసలు, భట్టి నాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని నిలదీసిన ఆయన.. భట్టి ఢిల్లీకి వెళ్ళింది ఖర్గేని సన్మానం చేయడానికే వెళ్లారు.. కమిటీల చర్చ జరగలేదు అని చెప్పుకొచ్చారు.. ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం.. మెట్టు దిగి అందరిని కలుపుకుని పోవాలి.. ఎన్నికలకు సిద్ధం అవ్వాలి.. పీసీసీ మెట్టు దిగి వచ్చి కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీదే అని స్పస్టం చేశారు మహేశ్వర్రెడ్డి.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!