Maheshwar Reddy: ఎంత గొప్ప నేత అయినా.. మాజీ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు వస్తోంది? అని ప్రశ్నించిన ఆయన.. కోవర్టులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరగాలన్నారు.. పార్టీ పగ్గాలు తీసుకున్న నాయకుడు అందరిని కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటే కోవర్టులు అనే చర్చ రాదని.. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే ఇలాంటి చర్చలు వస్తాయన్నారు.
Read Also: Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్ఎస్ భరతం పడతాం..
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఇక, పార్టీలో అందరూ కోరుకునేది ఆత్మభిమానమే అన్నారు మహేశ్వర్రెడ్డి.. ఎవరూ పీసీసీని తీసేయండి అని అనడం లేదు.. కోవర్టులు అనే నిందలు వేయడం కంటే.. ప్రత్యర్థులపై ఎందుకు కొట్లాడటం లేదు ? అని ప్రశ్నించారు. అందరం కలిసి పని చేసి.. అధికారంలోకి రావాలనే అజెండా ఉండాలన్న ఆయన.. పదవులు శాశ్వతం కాదు.. ఎంత గొప్ప నాయకుడు అయినా మాజీ అవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆత్మభిమానం చంపుకుని ఎవరు పని చేయరు.. కోవర్టులు ఉంటే బయటకు పంపాలి.. ఆధారాలు ఉంటేనే అంటారు కదా.. దామోదర రాజనర్సింహ ఆధారాలు లేకుండా అనరు కదా ? అని ఎదురు ప్రశ్నించారు. మరోవైపు, బలాబలాలు ప్రదర్శించుకోవడానికి అధికారంలో లేమని హితవుపలికిన ఆయన.. బలప్రదర్శన ఎన్నికల్లో చూపించుకోవాలి.. కమిటీలో చూపించుకుంటే ఏం లాభం? అని ఎద్దేవా చేశారు.. అసలు, భట్టి నాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని నిలదీసిన ఆయన.. భట్టి ఢిల్లీకి వెళ్ళింది ఖర్గేని సన్మానం చేయడానికే వెళ్లారు.. కమిటీల చర్చ జరగలేదు అని చెప్పుకొచ్చారు.. ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం.. మెట్టు దిగి అందరిని కలుపుకుని పోవాలి.. ఎన్నికలకు సిద్ధం అవ్వాలి.. పీసీసీ మెట్టు దిగి వచ్చి కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీదే అని స్పస్టం చేశారు మహేశ్వర్రెడ్డి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!