Maheshwar Reddy: ఎంత గొప్ప నేత అయినా.. మాజీ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు వస్తోంది? అని ప్రశ్నించిన ఆయన.. కోవర్టులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరగాలన్నారు.. పార్టీ పగ్గాలు తీసుకున్న నాయకుడు అందరిని కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటే కోవర్టులు అనే చర్చ రాదని.. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే ఇలాంటి చర్చలు వస్తాయన్నారు.
Read Also: Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్ఎస్ భరతం పడతాం..
Also Read
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
ఇక, పార్టీలో అందరూ కోరుకునేది ఆత్మభిమానమే అన్నారు మహేశ్వర్రెడ్డి.. ఎవరూ పీసీసీని తీసేయండి అని అనడం లేదు.. కోవర్టులు అనే నిందలు వేయడం కంటే.. ప్రత్యర్థులపై ఎందుకు కొట్లాడటం లేదు ? అని ప్రశ్నించారు. అందరం కలిసి పని చేసి.. అధికారంలోకి రావాలనే అజెండా ఉండాలన్న ఆయన.. పదవులు శాశ్వతం కాదు.. ఎంత గొప్ప నాయకుడు అయినా మాజీ అవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆత్మభిమానం చంపుకుని ఎవరు పని చేయరు.. కోవర్టులు ఉంటే బయటకు పంపాలి.. ఆధారాలు ఉంటేనే అంటారు కదా.. దామోదర రాజనర్సింహ ఆధారాలు లేకుండా అనరు కదా ? అని ఎదురు ప్రశ్నించారు. మరోవైపు, బలాబలాలు ప్రదర్శించుకోవడానికి అధికారంలో లేమని హితవుపలికిన ఆయన.. బలప్రదర్శన ఎన్నికల్లో చూపించుకోవాలి.. కమిటీలో చూపించుకుంటే ఏం లాభం? అని ఎద్దేవా చేశారు.. అసలు, భట్టి నాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని నిలదీసిన ఆయన.. భట్టి ఢిల్లీకి వెళ్ళింది ఖర్గేని సన్మానం చేయడానికే వెళ్లారు.. కమిటీల చర్చ జరగలేదు అని చెప్పుకొచ్చారు.. ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం.. మెట్టు దిగి అందరిని కలుపుకుని పోవాలి.. ఎన్నికలకు సిద్ధం అవ్వాలి.. పీసీసీ మెట్టు దిగి వచ్చి కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీదే అని స్పస్టం చేశారు మహేశ్వర్రెడ్డి.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?