Maheshwar Reddy: ఎంత గొప్ప నేత అయినా.. మాజీ అవ్వాల్సిందే..!
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు వస్తోంది? అని ప్రశ్నించిన ఆయన.. కోవర్టులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరగాలన్నారు.. పార్టీ పగ్గాలు తీసుకున్న నాయకుడు అందరిని కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటే కోవర్టులు అనే చర్చ రాదని.. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే ఇలాంటి చర్చలు వస్తాయన్నారు.
Read Also: Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్ఎస్ భరతం పడతాం..
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఇక, పార్టీలో అందరూ కోరుకునేది ఆత్మభిమానమే అన్నారు మహేశ్వర్రెడ్డి.. ఎవరూ పీసీసీని తీసేయండి అని అనడం లేదు.. కోవర్టులు అనే నిందలు వేయడం కంటే.. ప్రత్యర్థులపై ఎందుకు కొట్లాడటం లేదు ? అని ప్రశ్నించారు. అందరం కలిసి పని చేసి.. అధికారంలోకి రావాలనే అజెండా ఉండాలన్న ఆయన.. పదవులు శాశ్వతం కాదు.. ఎంత గొప్ప నాయకుడు అయినా మాజీ అవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆత్మభిమానం చంపుకుని ఎవరు పని చేయరు.. కోవర్టులు ఉంటే బయటకు పంపాలి.. ఆధారాలు ఉంటేనే అంటారు కదా.. దామోదర రాజనర్సింహ ఆధారాలు లేకుండా అనరు కదా ? అని ఎదురు ప్రశ్నించారు. మరోవైపు, బలాబలాలు ప్రదర్శించుకోవడానికి అధికారంలో లేమని హితవుపలికిన ఆయన.. బలప్రదర్శన ఎన్నికల్లో చూపించుకోవాలి.. కమిటీలో చూపించుకుంటే ఏం లాభం? అని ఎద్దేవా చేశారు.. అసలు, భట్టి నాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని నిలదీసిన ఆయన.. భట్టి ఢిల్లీకి వెళ్ళింది ఖర్గేని సన్మానం చేయడానికే వెళ్లారు.. కమిటీల చర్చ జరగలేదు అని చెప్పుకొచ్చారు.. ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం.. మెట్టు దిగి అందరిని కలుపుకుని పోవాలి.. ఎన్నికలకు సిద్ధం అవ్వాలి.. పీసీసీ మెట్టు దిగి వచ్చి కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీదే అని స్పస్టం చేశారు మహేశ్వర్రెడ్డి.
తాజావార్తలు
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!