YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- డీఎస్సీ నియామకాల అంశంపై వైఎస్ జగన్ విమర్శలు
- యువతకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత
- ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీఎస్సీ నియామకాల అంశంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులు యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల యువత నష్టపోతే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా మమ్మల్ని కాక్రోచ్ పార్టీ అని పిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే.. డీఎస్సీ అభ్యర్థులు యువకులు. వారి భవిష్యత్తు, వారి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుతున్నాం. వారికి న్యాయం చేయకపోతే ప్రభుత్వం తన బాధ్యతను ఎలా నిర్వర్తించినట్లు అవుతుంది’ అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ హక్కుల కోసం గళమెత్తడం సహజమని పేర్కొన్నారు. ప్రస్తుతం తరచూ ప్రస్తావనలోకి వస్తున్న ‘జెన్ జీ’ యువత కూడా ఈ వ్యవస్థలో భాగమేనని.. వారి ఆశయాలు, ఆకాంక్షలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించారు. ‘యువత కలలను, ఆశలను నలిపేస్తే కోట్లాది మంది ప్రజలు ఒకేసారి బయటకు వస్తారు. వారిని ఎవరైనా కాక్రోచ్లు అని పిలిస్తే, న్యాయం కోసం పోరాడే వారందరూ కాక్రోచ్లే అవుతారు. అలాంటి పోరాటంలో నేను కూడా వారిలో ఒకడిని’ అని జగన్ అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, యువతకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండబోమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని, వారి భవిష్యత్తుతో ఆటలాడకూడదని సూచించారు. డీఎస్సీ అవకతవకలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దగా పడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుని ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం డీఎస్సీ నియామకాలపై రాష్ట్రంలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!