ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక, […]
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఢిల్లీ నుంచి మళ్లీ రాష్ట్రానికి వచ్చారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్.. ప్రస్తుతం ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను.. ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా బదిలీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇక, పొర సరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీర పాండ్యన్ను బదిలీ చేసింది.. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ […]
YS Jagan Mohan Reddy: మరోసారి అధికారంలోకి రావడం కాదు.. ఈ సారి ఏకంగా 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అందుకు గాను గడగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.. ఇక, కుదిరినప్పుడల్లా.. వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇవాళ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం… ఈ […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి దిగజారుడు మాటలు తగవు అంటూ పవన్ కల్యాణ్కు హితవు పలికారు.. ఇక, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించిన ఆయన… అలాగే ఓ రాజకీయ నేత ఎలా ఉండకూడదో పవన్ కల్యాణ్ని చూసి నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఆరు […]
రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది.. క్రమంగా దిగజారుతూ.. రూపాయి పోకడ ఇప్పట్లో ఆగదా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. ఇవాళ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్తో రూపాయి మారకం విలువ 83.02కు పడిపోయింది.. అంటే ఒక డాలర్ కావాలంటే రూ. 83.02లు సమర్పించుకోవాల్సిందే.. అమెరికా డాలర్ స్వల్పంగా పెరిగినా… బాండ్ ఈల్డ్స్ పెరగడంతో డాలర్కు డిమాండ్ పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. డాలర్తో పోలిస్తే భారత రూపాయి […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందనే ప్రచారం సాగుతోంది.. తన విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్గా స్పందించిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి పోం.. ఇక్కడే తేల్చుకుంటాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. హస్తిన నుంచి పవన్కు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్ను ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం జనసేనాని హైదరాబాద్లో ఉన్నారు.. దీంతో, ఆయన ఢిల్లీ […]
విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది… జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే కాగా.. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు.. అయితే, బెయిల్ […]
తెలంగాణలో పెట్టుబడుల పర్వం కొనసాగుతూనే ఉంది… హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.. కొత్తగా సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా.. వీటి ద్వారా మూడు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది… జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్ సహా ఐదు ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం రోజురోజుకు […]
రిలయన్స్ జియో ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది.. ఆ సంస్థ ఇచ్చే ఆఫర్లను తట్టుకోవడం కూడా ప్రత్యర్థులకు కష్టంగా మారతుంది.. ఇప్పుడు పండుగ సమయంలో మూడు జియోఫైబర్ ప్లాన్లను విడుదల చేసింది.. ఆఫర్ ప్రయోజనాలను పొందేందుకు, వినియోగదారులు కొత్త కనెక్షన్ని కొనుగోలు చేసి, రూ. 599 మరియు రూ. 899 ప్లాన్లలో ఒకదానికి 6 నెలల పాటు సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది… ఈ ఆఫర్ అక్టోబర్ 18వ తేదీ నుంచి 28 మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. […]