APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం..
- వైజాగ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బతీసిన అమరావతి బౌలర్స్..
- ఎస్ డి ఎన్ వి ప్రసాద్ సూపర్ బ్యాటింగ్..
- అమరావతి వరుసగా రెండో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2026: విశాఖపట్నం( ఏ సి ఏ వి డి సి ఏ స్టేడియం )లో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 మూడవ రోజు తొలి మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్ మరియు క్యాపిటల్ అమరావతి రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. తొలుతగా టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.. మొదట బ్యాటింగ్కు దిగిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ కు ఆది నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి ఓపెనర్లను జట్టు కోల్పోవడంతో పాటు పవర్ ప్లే లో నాలుగు వికెట్ల నష్టానికి 37 పరుగులు మాత్రమే అమరావతి జట్టు చేసింది.. ఒక దశలో 100 పరుగులు కూడా సాధ్యమేనా అన్న పరిస్థితి నుండి వరుణ్ సాత్విక్ మరియు ప్రసాద్ బ్యాటింగ్ను కొంత ముందుకు తీసుకు వెళ్లిన తరువాత బండారు అయ్యప్ప శశికాంత్ ఇద్దరు వేగంగా ప్రసాద్తో జత కలిసి టీం స్కోర్ ను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు అమరావతి జట్టు చేసింది. దీంట్లో ఎస్ ఎన్ డి వి ప్రసాద్ 45 బంతుల్లో 54 పరుగులు రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో టీంకు అండగా నిలబడ్డాడు. మరొకవైపు చివరిలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన శశికాంత్ 14 బంతుల్లో 32 పరుగులు ఒక ఫోర్ నాలుగు సిక్సర్లతో బౌలర్లపై ఎదురు దాడి చేశారు.. దీంతో ఆ జట్టు మంచి స్కోరు చేయగలిగింది.. అటు వైజాగ్ లయన్స్ జట్టు బౌలర్లలో గిరి నాథ్ రెడ్డి ఢిల్లీ గణేష్ ప్రమోద్ రెండేసి వికెట్లు తీశారు..
అనంతరం లక్ష ఛేదనతో బ్యాటింగ్ దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు ఆది నుంచి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమయ్యాయి.. జట్టు ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ వరకు ఒక్కసారిగా టీం బ్యాటింగ్ కుప్పకూలింది.. తొలి ఓవర్ నుంచే అమరావతి జట్టు పేస్ బౌలర్ టోషిత్ యాదవ్ వైజాగ్ జట్టును ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అంత 100 పరుగుల లోపే వైజాగ్ జట్టు ఆలౌట్ అవుతుందని భావించిన సమయంలో ధనుష్, త్రిపురన విజయ్, ఇద్దరు వేగంగా పరుగులు సాధిస్తూ టీమ్ ను లక్ష్యసాధనకు దగ్గరగా తీసుకెళ్లిన విజయ్ తీరాల వైపు చేర్చలేకపోయారు.. విజయ్ 31 బంతుల్లో 40 పరుగులు మూడు ఫ్లోర్లు, ఒక సిక్సర్ మరియు ధనుష్ 27 బంతుల్లో 33 పరుగులు ఐదు ఫోర్లు మినహాయించి వైజాగ్ జట్టులో ఎవరో చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.. చివరిలో ఒకరిద్దరు బ్యాటర్స్ అడపాదడపా బౌండరీలు బాదిన విజయానికవి సరిపోలేదు.. దీంతో ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చూడక తప్పలేదు.. అటు అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్, మూడు వికెట్లు సాధించగా బండారు అయ్యప్ప శశికాంత్ రెండేసి వికెట్లు తీసి టీం ను విజయ పదం వైపు నడిపించారు.. మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ప్రసాద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది..
Also Read
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!