ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ నల్లధనాన్ని ఆపలేకపోతున్నారని విమర్శించారు.. నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి నిబంధనలు వర్తింవని తెలిసి ప్రైవేటు పరం చేయమని ప్రధానమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, ప్రైవేటు విమానాల్లో అక్రమ నగదు తరలిస్తున్నారని.. దేశంలోని ప్రైవేట్ విమానాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్ చేశారు నారాయణ.. ప్రతి […]
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యందం ఇందిరా… అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. […]
లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇప్పటికే అసలు ఇంకా ఎక్కడి లాస్ట్ చాన్స్ అప్పుడే అయిపోయిందికదా.. ఇక, ఆయన జీవితంలో మళ్లీ సీఎం కాలేడంటూ కామెంట్లు చేస్తున్నారు ఏపీ మంత్రులు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్… చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు.. ఇప్పుడు ప్రత్యేకంగా చివరి ఎన్నికలు ఏంటి? అని ప్రశ్నించారు.. […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు అందరూ చూశారన్న ఆయన.. ముఖ్యమంత్రి, పార్టీ నేతల మీద చివరకు ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారని విమర్శించారు.. చంద్రబాబుకు ఎందుకు అంత కోపం వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన.. […]
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. విపక్షాలు మరోవైపు తగ్గేదేలే..! అనే తరహాలో దూసుకుపోతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు.. అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.. అంతేకాదు, అయ్యన్న […]
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేస్తున్నది అసమర్థుడి అంతిమ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.. టీడీపీ అంపశయ్యమీద ఉంది.. వెంటిలేటర్ తీసేయడమే మిగిలిందంటూ వ్యాఖ్యానించారు.. ఎన్టీ రామారావును వైకుంఠానికి పంపిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హతలేదని ఫైర్ అయ్యారు.. ప్రజల కలలోకి వచ్చి ఎన్టీఆర్ ఆత్మే చంద్రబాబు దుర్మార్గాలు చెబుతుందన్నారు.. ఇక, చంద్రబాబులో […]
పర్సనల్ లోన్స్, వెహికల్స్ లోన్స్, హోం లోన్స్ ఈఎంఐలు కట్టేవారికి షాకిచ్చింది యాక్సిస్ బ్యాంక్.. వివిధ రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) సవరించింది. రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచేసింది. సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. న్యూ బెంచ్ మార్క్ ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి గరిష్టంగా 8.60 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు పేర్కొంది యాక్సిస్ బ్యాంక్.. అయితే, వడ్డీ […]
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది… ఆ సంస్థకు కో-ఫౌండర్ అయిన మోహిత్ గుప్తా గుడ్బై చెప్పేశారు.. దాదాపు ఐదేళ్లుగా కంపెనీతో కొనసాగుతూ వచ్చిన ఆయన.. ఇవాళ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.. జోమాటో యొక్క ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను మొదటి నుండి నిర్వహించడంలో గుప్తా కీలకంగా పనిచేశారు.. మే 2020లో సహ వ్యవస్థాపకుడిగా ఎలివేట్ చేయబడే ముందు సెగ్మెంట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. అయితే, తాను జొమాటోలో దీర్ఘకాలం […]
కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు వైసీపీ కార్యకర్తలు.. కర్నూలు ద్రోహి అంటూ నినాదాలు చేశారు.. మూడు రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు ఓవైపు.. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు మరోవైపు నినాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వారిపై అదేస్థాయిలో విరిచుకుపడ్డారు […]
పదే పదే ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారస్తులు… ఇవాళ మంత్రి బుగ్గన సమక్షంలో ట్రేడ్ అడ్వైయిజరీ కమిటీ సమావేశం జరిగింది… అయితే, ఈ సమావేశంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు వ్యాపారస్తులు.. అధికారులు వ్యాపారులతో పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు చేశారు… పదే పదే ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారో అర్థం కావడంలేదంటూ ఆవేదన వెలిబుచ్చారు.. ప్రభుత్వం వద్ద నిధుల్లేవని కొందరు […]