CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అత్యంత బాధాకరమైన విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ వ్యవహారంలో మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఎలాంటి కేసు లేదని, మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి తప్పుగా వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా రిటర్నింగ్ అధికారి పనిచేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టడం వెనుక కూడా కుట్ర ఉందని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నితిన్ నబీన్, ఎన్నికల అధికారుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. గాంధేయవాది అయిన మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు రాకుండా అడ్డుకోవడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని విమర్శించారు.
“ఇన్నాళ్లు బీజేపీ ఓట్ల చోరీ చేస్తుందని అనుకున్నాం.. ఇప్పుడు సీట్ల చోరీ కూడా చేస్తోంది” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదని, కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా కోర్టు నోటీసులు జారీ కావడం సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. ఆ ఫిర్యాదులో ఉన్న వ్యక్తిగత వివాదాలకు మీనాక్షి నటరాజన్కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించిన రేవంత్, గతంలో బీజేపీ గాడ్సే సిద్ధాంతాలను అనుసరిస్తోందని భావించామని, ఇప్పుడు ఉత్తర కొరియా తరహా రాజకీయాలను అనుసరిస్తోందనే భావన కలుగుతోందని విమర్శించారు.
Also Read
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
కిషన్ రెడ్డిపై మరోసారి విమర్శలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కేంద్రాన్ని కోరుతున్న సమయంలో, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సమస్యలపై కనీసం ఒక్క లేఖ అయినా కిషన్ రెడ్డి రాశారా అని ప్రశ్నించారు. కేంద్రంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR), హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఐఆర్ఎఫ్సీ రుణాలు, ఇతర కీలక ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి వరకు మెట్రో విస్తరణ విషయంలో కూడా రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం చొరవ చూపాలి
పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్కు ఏడు మండలాలను బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం అవసరమైన 1,500 ఎకరాల భూమి అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న ఈ అంశంపై కేంద్రం ముందుండి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైన ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావాలని, అందుకు కిషన్ రెడ్డి కృషి చేయాలని సూచించారు. అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!