వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా […]
సోషల్ మీడియాను షేక్ చేసే వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది… దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి… యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్లు వెళ్లినా.. డబుల్ మార్క్.. డబుల్ బ్లూ టిక్ మార్క్ మాత్రం కనిపించడం లేదని.. అసలు మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. ఇది ఒక సాంకేతిక సమస్యగా తేల్చేశారు నిపుణులు.. […]
సోషల్ మీడియాలో వాట్సాప్కు ప్రత్యేక స్థానం ఉంది… వీడియోలు, ఫొటోలు.. సందేశాలు పంపించే వెసులుబాటు ఉండడమే కాదు.. ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు వాట్సాప్లో ఉన్నాయి.. దీంతో, తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. స్మార్ట్ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్ ఉండాల్సిందే అనే స్థాయికి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు పనిచేయకపోయినా.. వాట్సాప్ యూజర్లు అల్లాడిపోతున్నారు. అయితే, భారత దేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.. సాంకేతిక సమస్యల […]
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది.. దీంతో ప్రధాన పార్టీలు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా.. మద్యం ఏరులైపారుతోంది.. ఓటర్లను డబ్బులు ఆశచూపి ఆకట్టుకుంటున్నారు.. మూడు ప్రధాన పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.. ఇక, బీఎస్పీ, కోదండరాం పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. అయితే, ఫైనల్గా మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీదే […]
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపుతోంది.. ఏ పార్టీ ఇస్తుంది.. ఏ పార్టీ పంచుతుంది అనే విషయం పక్కన పెడితే.. మద్యం ఏరులైపారుతోంది.. ఇక డబ్బులు వెదజల్లుతున్నాయి ఆయా పార్టీలు.. ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు… ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు కాపలాదారుడు అయ్యాడని ఆరోపించిన ఆయన.. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి.. […]
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకుంటారు సెక్యూరిటీ సిబ్బంది.. కానీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.. అదేంటి? సీఎం ఏంటి? కొరడా దెబ్బలు కొట్టించుకోవడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే.. ఛత్తీస్గఢ్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి రెండో రోజు ఉదయం ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. దుర్గ్ జిల్లా పటాన్ బ్లాక్లోని జజంగిరి గ్రామానికి వెళ్లారు.. అక్కడ గౌర్-గౌరీకి పూజలు చేసి.. రాష్ట్ర ప్రజలు […]
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు… భారత్ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సోమవారం రోజు ఈ వార్త తెలియడంతో.. భారతీయులు మరింత జోష్గా ఉత్సవాలు నిర్వహించారు.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి చెందిన నేత రిష్ సునాక్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన మామ, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి… సోషల్ మీడియాలో తన […]
ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియా యాప్స్తో పాటు మరికొన్ని యాప్స్… ఆ యాప్స్ ఇస్టాల్ చేసే సమయంలో.. వారు పెట్టే కండీషన్స్కు అన్నింటికీ ఒకే.. ఒకే కొట్టేయడమే.. ఇదే పెద్ద సమస్యగా మారుతుంది.. కొన్ని యాప్స్ ఫోన్ను గుల్ల చేస్తుంటే.. మరికొన్ని యాప్స్.. సదరు వినియోగదారుల సమాచారాన్ని మొత్తం లాగేస్తుంది.. అసలుకే ఎసరు పెట్టేవరకు వెళ్తోంది పరిస్థితి.. ఈ నేపథ్యంలో.. ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ను […]
భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డామ్లో అతి పిన్న వయస్కుడైన మొదటి ప్రధానిగా రికార్డు సృష్టించారు.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతిపిన్న ప్రధాని రిషి సునాక్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అది కూడా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో.. ఇదే కదా అసలైన పండుగ అంటూ దీపావళి సంబరాలను హోరెత్తించారు భారతీయులు.. అయితే, రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన నేపథ్యంలో.. ప్రపంచంలోని పలు దేశాల్లో కీలకంగా పనిచేస్తూ […]
సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా యమ యాక్టీవ్గా ఉంటారు.. ఏ సందర్భాన్ని కూడా వదలరు.. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించిన నేపథ్యంలో… గతంలో భారత్పై బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కౌంటర్ ఇచ్చారు మహీంద్రా… రిషి సునాక్ యూకే ప్రధానమంత్రి అయ్యాక, భారతదేశం గురించి విన్స్టన్ చర్చిల్ యొక్క 1947 సిద్ధాంతం తప్పు అని ఎత్తిచూపారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ […]