దీపావళి పండుగను.. పెద్దలు, చిన్నలు.. అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు.. పెద్దలు పూజలు, నోముల్లో నిమగ్నమైపోతే.. చిన్నారులు మాత్రం.. హుషారుగా టపాసులు కాల్చుతూ.. స్వీట్లు తింటూ.. మూడు రోజుల పాటు.. ఎంతో జోష్తో సెలబ్రేట్ చేసుకుంటారు.. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే, దీపావళి పండుగ ఎలా వచ్చింది.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగ వెనుక ఉన్న కథలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.. […]
నాన్ వెజ్ ప్రియులకు బంపరాఫర్ ప్రకటించాడు ఓ షాపు యజమాని.. మీరు.. ఒకేసారి మటన్, చికెన్ రెండూ తినాలి అనుకుంటే.. కేవలం మటన్ కొంటే సరిపోతుంది.. ఎందుకంటే.. మటన్ కొనుగోలుపై చికెన్ ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చాడు.. ఆ యజమాని.. ఇదేదో ఒక్కరోజుకే పరిమితమైన ఆఫర్ కాదు.. కానీ శనివారం మరియు సోమవారం షాపుకు సెలవు అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.. మొత్తంగా నాన్వెజ్ వ్యవహారం కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. కొందరు ప్రశంసలు […]
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రూట్లను వెదుకుతూనే ఉన్నారు.. చివరకు పండుగలను కూడా వదలడం లేదు.. పండుగల మెసేజ్ పేరుతో ఏదో లింక్ పంపండం.. ఆ లింక్ మాటున.. వివరాలను సేకరించి.. మోసాలకు పాల్పడుతున్నారు.. దీపావళి పండుగకు ముందు.. ఆ పండుగ పేరుతో నయా ఫ్రాడ్కు తెరలేపారు కేటు గాళ్లు.. దీపావళి సందడి భారత్లో మొదలైన తరుణంలో దీపావళి మెసేజెస్, గిఫ్ట్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొన్ని చైనీస్ వెబ్సైట్స్.. ఫ్రీ దివాళీ గిఫ్ట్స్ పేరుతో పిషింగ్ […]
* టీ20 వరల్డ్కప్లో నేడు ఉదయం 9.30 గంటలకు బంగ్లాదేశ్తో నెదర్లాండ్స్ మ్యాచ్.. * టీ20 వరల్డ్కప్లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సౌతాఫ్రికాతో జింబాబ్వే ఢీ.. * దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రేక్.. ఢిల్లీకి వెళ్లిన రాహుల్ * ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలులో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు.. * ఒంగోలు కేశవస్వామిపేట చెన్నకేశవ […]
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం, […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా సంచలనంగా మారుతుంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హడావుడి చేస్తూ.. నవ్వులు పూయించిన ఆయన.. ఇప్పుడు.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.. ఇక్కడ కూడా.. తగ్గేదే లే అనే తరహాలో రెచ్చిపోతున్నారు పాల్.. మునుగోడులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ తనను ఆపిన అధికారుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ […]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఈ సీజన్లో నిర్మాణ పనుల ఆలస్యానికి కారణం.. భారీ వర్షాలు, వరదలే అన్నారు.. ఈ సీజన్లో ఊహించని విధంగా వరదలు రావడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయన్న ఆయన.. మూడు సార్లు వరదల కారణంగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామన్నారు.. అయితే, వరద మరింత తగ్గు […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్… ఇటీవల పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఆ తర్వాత ఆంక్షల మధ్య ఆయన వైజాగ్ను వీడడం.. జనసేన ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో.. అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మూడు పెళ్లిళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు పవన్ .. నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా […]
రామచంద్రాపురంలో జరిగిన ఘటనతో తాతాల్కికంగా తమ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు అమరావతి రైతులు.. పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చామన్నారు.. అయితే, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు ఆపలేదని స్పష్టం చేశారు.. దీనిపై […]
మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది… ఇవాళ అంటే 23.10.2022న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.. ఈ ప్రయోగం ద్వారా 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.. ఈ నేపథ్యంలో చెంగాళమ్మ పరమేశ్వరి […]