* ఢిల్లీ: నేటితో ముగియనున్న గౌతమ్ మల్హోత్రా ఈడీ కస్టడీ.. లిక్కర్ స్కాంలో గౌతమ్ మల్హోత్రానీ అరెస్ట్ చేసిన ఈడీ.. కస్టడీ ముగియడంతో ఇవాళ రౌస్ ఏవెన్యూ స్పెషల్ కోర్టులో గౌతమ్ మల్హోత్రాను ప్రవేశ పెట్టనున్న ఈడీ అధికారులు
* జగిత్యాల జిల్లా: నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న తెలంగాణ సీఎం.. ఇటీవల 100 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి.. కొండగట్టులో మౌళిక సదుపాయాలు మాస్టర్ ప్లాన్ పై అధికారులుతో నేడు సమీక్ష.. సీఎం పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
* నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. రూ.8,800 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన.. పులివెందులలో వివాహ వేడుకలో పాల్గొననున్న సీఎం జగన్
* 9వ రోజు రేవంత్ రెడ్డి యాత్ర.. పాలకుర్తి నియోజక వర్గం దేవరుప్పుల గ్రామంలో బాలయేసు స్కూల్ సమీపంలోగల శిబిరం నుండి ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం.. కొత్త కాలనీ, దేవరుప్పుల తండ, దర్మపురం, మాల్యా తాండ, మైలారం మీదుగా సాగనున్న యాత్ర.. విసునూరు వద్ద మధ్యాహ్న భోజన విరామం.. వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు గ్రామంలో రాత్రి బస.
* ప్రకాశం : పొదిలి శివాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా శేషవాహన ఉత్సవం, అర్ధనాదిశ్వరవతారంలో దర్శనం ఇవ్వనున్న స్వామివారు..
* బాపట్ల : చీరాల మండలం జాండ్రపేటలో చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి జ్యోతిర్మహోత్సవాలలో భాగంగా ఆజ్ఞ మహోత్సవం, అనంతరం బాణా, ఈటె, కత్తి, బాక్సింగ్, తదితర విన్యాసాలు..
* ప్రకాశం : గిద్దలూరులో యాదవుల ఆత్మీయ సమ్మేళనం, ముఖ్య అతిధులుగా హాజరుకానున్న రాష్ట్రంలోని యాదవ ప్రముఖులు..
* ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పంచయతన హోమ మహోత్సవాలు..
* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 398 అంశాల అజెండాపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి.. రూ.3500 కోట్ల అంచనాతో 2023-24 వార్షిక సంవత్సర బడ్జెట్కు ఆమోదం తెలపనున్న పాలకమండలి.. అలిపిరి వద్ద స్పిర్య్టూవల్ సిటీ నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయింపు, లడ్డూ పోటు యాంత్రికరణ అంశంపై నిర్ణయం.. తమిళనాడులోని ఉల్లందురు పేట, యానంలో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపు.. లడ్డూ కౌంటర్ల పెంపుదలపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులపాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జగ్గంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
* గుంటూరు: నేడు కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం.. హాజరుకానున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు..
* గుంటూరు: ఈ ఫార్మసీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేడు కొత్తపేటలో ఫార్మసీ వ్యాపారుల నిరసన…
* గుంటూరు: నేటి నుంచి మూడు రోజులపాటు విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన్ మహోత్సవ్.. ఉత్సవాలను ప్రారంభించనున్న యువజన సర్వీసు శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జి వాణి మోహన్, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్…
* గుంటూరు: ఈనెల 16న మేడికొండూరు జడ్పీ హైస్కూల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా…
* అనంతపురం : గుత్తి మండలం సేవగడ్ లో వెలసిన శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో పూజలు మహిళలు పూర్ణ కళాశాలలో భారీ ఊరేగింపు.
* నెల్లూరు జిల్లా మనుబోలులో జరిగే కురసారతులు సచివాలయ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. అనంతరం తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తిరుపతి: నేడు సత్యవేడు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. కీలపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. వెంకటరెడ్డి కండ్రిగలో భోజన విరామం.. రాయపేడు విడిది కేంద్రంలో రాత్రి బస.
* శ్రీకాకుళం: నేటి నుంచి పలాస నుంచి విశాఖపట్నం మధ్య ఈఎంయూ రైలు పునః ప్రారంభం.. కరోనా కారణంగా రద్దు చేసిన ఈఎంయూ రైలును రెండేళ్లు తర్వాత పునః ప్రారంభం
* నంద్యాల: నేడు నంద్యాల నుండి మహానందికి బయలుదేరనున్న మహానందీశ్వర స్వామి కామేశ్వరి దేవి అమ్మవారు ఉత్సవ విగ్రహాలు.. మహానందిలో నేడు శివరాత్రి ఏర్పాట్లపై ఆర్జీవో సమీక్ష సమావేశం
* కర్నూలు: నేడు హాళగుంద మండలం హెబ్బటంలో సామూహిక వివాహాలు.. పాల్గొనున్న మంత్రి జయరాం..