APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2026: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ 2026 సీజన్-5లో నాలుగో రోజు తొలి మ్యాచ్లో విజయవాడ సన్ షైనర్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాకినాడ కింగ్స్పై సమిష్టి ప్రదర్శనతో 202 పరుగుల భారీ స్కోరును కాపాడుకుంటూ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన విజయవాడ సన్ షైనర్స్కు గత మ్యాచ్లో సెంచరీతో మెరిసిన అశ్విన్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే మరో ఓపెనర్ ఎం. అభినవ్ బాధ్యత తీసుకుని దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు 36 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అభినవ్కు మంచి సహకారం అందించారు. చివర్లో జహీర్ అబ్బాస్ కేవలం 11 బంతుల్లో 25 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఊపు తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్లో ఒక ఫోర్, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. దీంతో విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. కాకినాడ బౌలర్లలో గిరి ప్రసాద్ మూడు వికెట్లు పడగొట్టగా, ఆశిష్ రెండు వికెట్లు సాధించాడు.
Also Read
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
లక్ష్య ఛేదనలో తడబడిన కాకినాడ
203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. విజయవాడ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు 5 వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులకే పరిమితమైంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లేకాజ్ రెడ్డి ఒంటరి పోరాటం చేశాడు. అతడు 33 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టును గెలుపు వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ తపస్వి 25 బంతుల్లో 31 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కాకినాడ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
భరత్ బౌలింగ్ మెరుపులు
విజయవాడ బౌలర్లలో భరత్ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ను దెబ్బతీశాడు. సిద్దార్థ్, మోహన్, సుమిత్ తలో రెండు వికెట్లు సాధించి విజయానికి బాటలు వేశారు. సమిష్టి బౌలింగ్ ప్రదర్శనతో కాకినాడ జట్టును కట్టడి చేసిన విజయవాడ సన్ షైనర్స్ టోర్నీలో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అభినవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
బ్యాటింగ్లో కీలకంగా రాణించి జట్టు భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎం. అభినవ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అతని ఇన్నింగ్స్ విజయవాడ విజయంలో కీలక పాత్ర పోషించింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!