డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది జియో.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ నివేదికను విడుదల చేసింది
మధ్యాహ్న భోజనం వికటిస్తోంది.. భోజనం తిన్న వెంటనే విద్యార్ధులు వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.. వరుస ఘటనలతో బడి భోజనం అంటేనే హడలిపోయే పరిస్దితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడి భోజనం భయపెట్టిస్తోంది. వారం రోజులుగా 10 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించి.. వందకు పైగా చిన్నారులు ఆసుపత్రుల పాలు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2వేలకు సర్కారు బడులు ఉండగా.. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు మధ్యాహ్న […]
మ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చింది సిట్.. ఈ నెల 21వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Thackeray Memorial purified: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేకి నమ్మకస్తుండి.. తన కేబినెట్లో మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే.. బయటకు వెళ్లిపోవడమే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలను సైతం తన వెంట తీసుకెళ్లాడు.. దీంతో ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.. దీంతో, షిండేను వెనక ఉండి […]
ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.. పాత వాటితో కొత్త సమస్యలు వస్తున్నాయంటే.. వాటిని అధిగమించడానికి కొత్త దారులను వెతుకుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్).. ఇప్పుడు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్)లపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది… డాట్ తీసుకొచ్చిన ఈ నయా రూల్ ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా సహా టెలికాం ఆపరేటర్లకు అందరికీ వర్తించనుంది.. ఇంతకీ ఎస్ఎంఎస్లపై కొత్త రూల్ అంటే.. మొత్తంగా ఎస్ఎంఎస్లు ఆపేస్తారా ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం […]
మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది.. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇక, ఎవ్వరితో పనిలేదు అనేలా పరిస్థితి తయారైంది.. చిన్న, పెద్ద తేడాలేకుండా.. స్మార్ట్ఫోన్ లేకుంటే క్షణం కూడా ఉండలేకపోతున్నారు.. ఈ తరుణంలో ఓ గ్రామ పంచాయతీ చేసిన ఏకగ్రీవ తీర్మానం వైరల్గా మారిపోయింది.. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బన్నీ గ్రామంలో.. 18 ఏళ్ల లోపు చిన్నారులు, యువత మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు.. దీనిపై గ్రామ పంచాయతీ ఏకగ్రీవ […]
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2024 ఎన్నికలు కీలకమైనవని పేర్కొన్న ఆయన.. రీజినల్, డెమోక్రటిక్ పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం అన్నారు.. ప్రస్తుత పరిస్థితిపై లెఫ్ట్ పార్టీలు అధ్యయనం చేస్తున్నాయన్నారు.. ఇండియా సెక్యులర్ దేశంఅని.. మరోవైపు దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.. పేదలను నిత్యావసర ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్య వేధిస్తోందన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన […]
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. ఇదే నాకు చివరి ఎన్నిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచాయి… అసెంబ్లీలో నన్ను అవమానించారు.. నా భార్యను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇప్పుడున్నది కౌరవ సభ అని ఆరోపించారు.. ఆ కౌరవ […]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేసిన ఆయన.. నామినేషన్ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని రాసుకొచ్చారు. అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ […]