Anil Kumar Yadav:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్కు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సవాల్ విసిరితే.. ఆ సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ కి సవాల్ విసిరారు.. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా.. అంటూ లోకేష్, పవన్ను చాలెంజ్ చేశారు.. ఈ విషయాన్ని పాదయాత్రలో లోకేష్ ప్రకటించచగలరా..? అని నిలదీశారు.. ఇక, పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా..? అని ఎద్దేవా చేశారు.. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా? జగన్ గురించి మాట్లాడేది..? అంటూ మండిపడ్డారు అనిల్ కుమార్..
Read Also: Mahesh Babu: ఏమున్నాడ్రా బాబు… సిక్స్ ప్యాక్ గ్యారెంటీ
ఇక, మాకు పొత్తులు అవసరం లేదు.. అప్పుడు, ఇప్పుడు.. మేం సింగిల్ గానే పోటీ చేస్తాం అని ప్రకటించారు అనిల్ కుమార్ యాదవ్.. కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు ఆ సత్తా ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసలు గుప్పించారు.. ఉద్యోగాల్లో మా హయాంలో వచ్చిన అవకాశాలు గతం కంటే ఎక్కువ అని ప్రకటించిన ఆయన.. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు మొత్తం మా వైపే ఉన్నారు.. వైసీపీ అభ్యర్థులు ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. ప్రజాప్రతినిధులను ధైర్యంగా ప్రజల్లోకి పంపే ఒకే ఒక్క సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.