SBI hikes MCLR: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది.. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇక, ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.. ఎస్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారంగా మారాయి.. వెహికల్స్ లోన్స్, పర్సనల్ […]
Rescue operation For Eagle: మానవత్వం మంట గలుస్తోంది.. సాటి మనిషి ఆపదలో ఉంటే.. పట్టించుకునేవారు కాదు.. పలకరించేవారు కూడా కరువవుతున్నారు. అయితే, ఓ జవాన్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ ప్రాణినిచూసి అల్లాడిపోయాడు.. వెంటనే సమాచారం ఇచ్చాడు.. చివరకు దానిని ప్రాణాలతో కాపాడగలిగాడు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లో ఓ చెట్టుపై గద్ద వేలాడుతోంది.. అది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన […]
ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే... ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నారు.. టాలీవుడ్ సూపర్ స్టార్, తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన కృష్ణ కన్నుమూయడంతో.. రేపు హైదరాబాద్ వెళ్లనున్న ఆయన.. సూపర్స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించనున్నారు.. సూపర్ స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.. సూపర్స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. మధ్యాహ్నం 2.20 […]
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి.. దొరికిపోయిన ఘటన తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీ నేతలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని.. ఇంతకంటే దారుణం ఏదైనా […]
ఎయిరిండియా 121.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 990 కోట్ల రూపాయలు రీఫండ్గా.. 1.4 మిలియన్ డాలర్లు అంటే రూ.11.35 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది అమెరికా
ట్విట్టర్, ఫేస్బుక్, మరికొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు కూడా తమ ఉద్యోగులను తగ్గించుకునేపనిలో పడిపోయాయి.. ట్విట్టర్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత.. చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ఐటీ సెక్టార్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు కోత తప్పదనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి.. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అదేబాటపట్టినట్టుగా తెలుస్తోంది.. ఏకంగా 10,000 మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.. కార్పొరేట్, టెక్నాలజీ విభాగంలోని ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగించేందుకు అమెజాన్ […]
భారతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను పెంచాలి అనే వాటిపై అవగాహన కొరకు మామ్ టు బి 2023 అనే కార్యక్రమాన్ని.. డా. ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించారు.. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులు పిల్లలు ఏగా సరిచేసుకోవాలి? పిల్లల్లో వచ్చేటువంటి ఆటిజం, ఏడీహెచ్, హైపర్ ఆక్టివ్ మరియు ప్రవర్తన లోపాల గురించి విశ్లేషణ జరుపుతూ సమాజంలో పిల్లల కొరకు ఎవరైతే […]