R5 Zone Layouts: ఆర్ ఫైవ్ జోన్లో లేఅవుట్లు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R5 Zone Layouts: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ఇవ్వనుంది. అమరావతి పరిధిలోని పలు గ్రామాల పరిధిలో సుమారు 1402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని లే అవుట్ లలో అభివృద్ధి ప్రక్రియ పూర్తి అయ్యింది. సరిహద్దు రాళ్లు వేయటమే కాకుండా వాటి పై నెంబరింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఆ యా లే అవుట్ల దగ్గర లే అవుట్ మ్యాప్ లను కూడా ప్రదర్శనకు పెట్టారు.
మరోవైపు వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 50 వేల మంది లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా లే అవుట్ లలోనే సభ ఏర్పాటు చేయాలని భావించినా…గ్రామాల రహదారులు ఇరుకుగా ఉండటంతో సీడ్ యాక్సిస్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సభకు ఎంపిక చేశారు. ఆ పక్కన వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఏర్పాటు చేశారు.
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా లాంఛనంగా పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత లబ్దిదారులకు షెడ్యూల్ తేదీలు ఖరారు చేసి వాటి ప్రకారం పట్టాలు అందజేస్తారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. మొత్తం లే అవుట్ స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాంటింగ్ చేశారు. మిగిలిన భూమిలో అంతర్గత రోడ్ల కోసం ఎక్కువ స్థలం కేటాయించారు. అప్రోచ్, అంతర్గత రోడ్లకు 36 శాతం భూమిని కేటాయించారు. మొత్తం ల్యాండ్లో 10 శాతం ఓపెన్ స్పేస్ గానూ, మిగిలిన భూమిని పార్కింగ్, యుటిలిటీ కోసం కేటాయించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల తయారీ కసరత్తు కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఆన్ లైన్ చేయటం, లబ్దిదారుల మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎల్లుండి పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా చేపట్టనుంది.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!