Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి వందల కోట్ల రూపాయల మేర భారీ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ షేర్స్ బజార్ , కిసాన్ పరివార్ సంస్థలు నమ్మబలికాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందల మందితో పాటు దేశవ్యాప్తంగా వేలాది మందిని ఈ సంస్థలు బురిడీ కొట్టించాయి. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఫిర్యాదు చేయడంతో ఈ దందా గుట్టు రట్టయింది.
మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఈ భారీ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతను కొండాపూర్లో ‘షేర్స్ బజార్’ అనే సంస్థను ప్రారంభించి.. తమకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందని నకిలీ ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించాడు. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే నెలకు 4 శాతం చొప్పున ఖచ్చితమైన రాబడి ఇస్తామని నమ్మబలికాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏకంగా 150 మందికి పైగా ఉద్యోగులతో ఒక పెద్ద కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఫోన్ కాల్స్, ఆన్లైన్ ప్రచారాలు చేస్తూ పెద్ద ఎత్తున కస్టమర్లను వలలో వేసుకున్నాడు.
Also Read
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
సంస్థ మాటలు నమ్మిన బాధితులు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. కొందరైతే తమ పొలాలు, భూములు, బంగారం అమ్మి వచ్చిన డబ్బును కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే, 2025 అక్టోబర్ నుంచి పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన పేఔట్లను భూపాల్ అకస్మాత్తుగా నిలిపివేశాడు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తానూ ఎవరికీ డబ్బులు ఇవ్వనని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగాడు.
ఇప్పటికే గుజరాత్కు చెందిన కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు భూపాల్ దేశం విడిచి పారిపోకుండా గుజరాత్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది వరకు బాధితులు ఉండవచ్చని, మోసం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
-
Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
-
Pakistan: లైంగిక నేరస్తుడు ‘‘డాడీ’’పై బ్రిటన్తో పాకిస్తాన్ డీల్.!
-
Jofra Archer: ‘నేను ముందే చెప్పా.. సూర్యవంశీని అవుట్ చేయడం ఎలానో నాకు తెలుసని’..
-
Kadiyam Srihari: “నేనేం తప్పు చేయలేదు”.. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..