YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.. తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది.. వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.. అయితే, నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా మార్చడంపై వైఎస్ భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా […]
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ విషయంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా మారిపోతోంది.. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్, వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయం స్పష్టం చేయాలి.. బిడ్లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అని ఏపీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలో మీడియాతో […]
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకరేపుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్న సింగరేణి డైరెక్టర్ల బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్నారు.. ఈవోఐ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు.. మరో రెండు రోజుల పాటు విశాఖలో సింగరేణి […]
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూత్ ఐకాన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. అమరావతిలో తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన క్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.. ఇక, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన అధికారులు. ఈ ఏడాది కాలంలో మిగిలిన మంత్రులతో పోల్చుకుంటే తనకు ప్రశంసలు దక్కాయన్న రోజా.. ఉన్నతాధికారులతో […]
Off The Record: కేసీఆర్ తొలి కేబినెట్లో మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ నుంచి బహిష్కరించడంతో కొల్లాపూర్ పొలిటికల్ లీడర్స్ ఒక్కసారిగా అటెన్షన్ మోడ్లోకి వచ్చారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలను సొంతం చేసుకున్న జూపల్లి 2018 ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్థన్రెడ్డి… మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరారు. దీంతో ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. జూపల్లి , హర్షవర్దన్ రెడ్డి […]
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ దీని పార్లమెంట్ పరిధి మాత్రం బాపట్లలో ఉంటుంది. ఒంగోలుకు దగ్గర కావడంతో జిల్లా పరిధి ప్రకాశంలోనే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో బాగానే ఉన్నా… ఆ తర్వాత అధికారుల బదిలీలు, తనకు నచ్చిన వారికి పనుల కేటాయింపు లాంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు […]
Off The Record: బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనగా మారాయి….కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి…. బాపట్ల లోక్సభ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడ్గా చేయడం చారిత్రక తప్పిదం అని ఆయన అన్న మాటలు సొంత పార్టీ వైసీపీలోనే సెగలు పొగలు పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఎస్సీలను అవమానించేలా కోన రఘుపతి మాట్లాడారంటూ ఆ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారట. వ్యవహారం కోనకు వార్నింగ్లు ఇచ్చేదాకా […]
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2009,14,19ల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు బ్రేకులు వేసేందుకు ఒకసారి పీఆర్పీ, రెండు సార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా అంతంత మాత్రమే. అయినా… వెలగపూడికి మెజారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలతో సత్సంబంధాలు, వర్గ […]
Off The Record: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారట. ఇన్నాళ్ళు అసంతృప్తిగా ఉన్న నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఇదే అదను అనుకుంటున్నారట. అసంతృప్త నేతలంతా కలిసి ఏకంగా ఎమ్మెల్యేకు సమాతరంగా కార్యక్రమాలు నిర్వహించడమే ఇప్పుడు కోదాడ బీఆర్ఎస్లో హైలైట్. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు కలసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా […]
మత్స్యకారులు అలర్ట్.. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం.. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల […]