Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
- యువత ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం
- విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగుతుంది
- జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ (NEET) పరీక్ష వివాదంపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం వెనుక ‘డీప్ స్టేట్’ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. అది యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబమని భావించే వారు కూడా ఉన్నారని జైరాం రమేష్ అన్నారు.
ఒక ఇంటర్వ్యూలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. కాక్రోచ్ ఉద్యమం ఎలా ప్రారంభమైందనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ‘‘కొంతమంది ఇది డీప్ స్టేట్ ప్రాయోజిత ఉద్యమమని అంటున్నారు. మరికొందరు యువతలో ఉన్న నిరాశ, ఆగ్రహానికి ఇది ప్రతిబింబమని చెబుతున్నారు. ఈ రెండు వాదనల్లో ఏది నిజమో నిరూపించడం కష్టం. కానీ ఈ ఉద్యమం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
- Ketan Agarwal Case: కేతన్ ముందే అనుమానించాడు, కానీ సియా నటన ముందు ఓడిపోయాడు..
- Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
అయితే కాక్రోచ్ ఒక రాజకీయ పార్టీ కాదని.. ప్రజాస్వామ్యంలో చివరకు రాజకీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ‘‘యువత అసంతృప్తిని దేశానికి తెలియజేయడంలో ఈ ఉద్యమం ఒక వేదికగా పనిచేసింది. కానీ ఆ సమస్యలను ముందుకు తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపాల్సింది స్థిరమైన రాజకీయ పార్టీలే’’ అని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోటాలో విద్యార్థులతో సమావేశమైన రాహుల్ గాంధీ.. త్వరలో ప్రయాగ్రాజ్, పాట్నా, ఢిల్లీ నగరాల్లో కూడా విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. ‘‘రాహుల్ గాంధీ కేవలం NEET లేదా CBSE పరీక్షల అంశాన్నే లేవనెత్తడం లేదు. దేశ విద్యా వ్యవస్థ, పరీక్షల విధానం, విద్యపై ప్రభుత్వ పెట్టుబడులు వంటి మౌలిక అంశాలపై చర్చను ముందుకు తీసుకెళ్తున్నారు’’ అని జైరాం రమేష్ పేర్కొన్నారు. అలాగే కోటాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘భారత కుటుంబాలు కోచింగ్ సెంటర్లపై ఖర్చు చేస్తున్న డబ్బు కంటే కేంద్ర ప్రభుత్వం విద్యపై తక్కువగా ఖర్చు చేస్తోంది’’ అని చెప్పారని గుర్తు చేశారు. దీనిని విద్యా వ్యవస్థలో ఉన్న మౌలిక అసమతుల్యతగా జైరాం రమేష్ అభివర్ణించారు.
తాజావార్తలు
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
-
Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
-
Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
-
Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!