Sampath Kumar
Author- NTV Telugu-
Revanth Reddy: సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి సింగపూర్ చేరుకున్న సీఎం.. ఈరోజు ఉదయం ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, ఐటీ, విద్య, నైపుణ్య నిర్మాణంపై చర్చించారు. ఈ సమావేశంలో సింగపూర్లోని అభివృద్ధి పనులతో […] -
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 19 మంది మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్కౌంటర్లో ముందుగా నలుగురు చనిపోగా.. ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ […] -
Hyderabad: అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కోసం 8 పొలిసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్పూర్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు వందకి పైగా సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ […] -
Ponnala Lakshmaiah: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్లోని పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు అపహరణకు గురయ్యాయి. పొన్నాల సతీమణి అరుణా దేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పొన్నాల ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ చోరీ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: BRS Rythu Dharna: నేడు […] -
BRS Rythu Dharna: నేడు షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై ‘ రైతు ధర్నా’ పేరుతో బీఆర్ఎస్ పోరాటానికి సిద్దమైంది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా, నిరసన […] -
Fire Accident: షేక్పేట్ రిలయన్స్ ట్రెండ్స్లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు!
షేక్పేట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జుహి ఫెర్టిలిటీ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్కి మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్కు మంటలు అంటుకున్నాయి. దాంతో గ్రౌండ్ ఫ్లోర్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓవైపు భారీగా మంటలు ఎగిసిపడుతుంటే.. మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది. Also Read: Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం! సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. భారీ పొగ కారణంగా […] -
Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని కేకలు విన్న పక్క గదిలోని నలుగురు విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. […] -
Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!
చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం 20 అడుగులు జారుకుంటూ రోడ్డు […] -
Viral Video: సామ్తో సెల్ఫీ కోసం లగెత్తాడు.. కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు!
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్స్టాస్ మంచి ఆటతీరును ప్రదర్శించాడు. టీమిండియాపై నాలుగు ఇన్నింగ్స్లలో (60, 8, 23, 22) 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల ఘటనలతో హాట్ టాపిక్గా మారిపోయాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సామ్.. ఒక్క సిరీస్తో ఆస్ట్రేలియా అభిమానులకు క్రేజీ ప్లేయర్గా మారిపోయాడు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఆటోగ్రాఫ్ కోసం ఓ […] -
CM Revanth Reddy: నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన.. భారీ పెట్టుబడులే లక్ష్యం!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!