Ravindra Jadeja: దయచేసి పుకార్లు పుట్టించకండి.. హగ్ చేసుకుంటే..?
- రిటైర్మెంట్ వార్తలపై రవీంద్ర జడేజా ఫైర్
- హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా?
- అనవసర వదంతులు వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో జడేజా తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. రిటైర్మెంట్ వార్తలపై జడ్డు ఫైర్ అయ్యాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా? అని మండిపడ్డాడు. దయచేసి పుకార్లు పుట్టించకండి అని జడేజా కోరాడు.
ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు సీనియర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురి వయసు 35 దాటేసింది. టీ20 ప్రపచకప్ 2024 గెలిచిన అనంతరం పొట్టి ఫార్మాట్కు అల్విదా పలికారు. వన్డే ప్రపంచకప్ 2027లో ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వీరు రిటైర్మెంట్ ప్రకటించచే అవకాశం ఉందని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. ఫైనల్లో జడేజా వ్యవహరించాడు. ఫైనల్లో తన 10 ఓవర్ల కోటా ముగిసిన వెంటనే కోహ్లీని హగ్ చేసుకున్నాడు. దాంతో జడ్డు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ వార్తలను జడేజా ఖండించాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ ఇస్తున్నట్లా అని ప్రశ్నించాడు?. ‘అనవసర వదంతులు వద్దు’ అని జడేజా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
Also Read
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. స్టార్ ప్లేయర్పై రెండేళ్ల నిషేధం!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ వార్తలకు తెరదించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తనకు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశం లేదన్నాడు. టీమిండియా మంచి స్థానంలో ఉన్నప్పుడే తాను వీడ్కోలు పలుకుతానని విరాట్ చెప్పాడు. దాంతో వన్డేల్లో ఈ ముగ్గురు మరికొన్నాళ్లు కొనసాగనున్నారు. ప్రపంచకప్ 2027 వరకు ముగ్గురు కొనసాగే అవకాశం ఉంది. మరో రెండేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?