KL Rahul: సంజనా.. దూలతీరిపోయింది!
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ విజయం
- 26 వికెట్లు తీసిన భారత్ స్పిన్నర్లు
- వికెట్స్ వెనకాల శ్రమించిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలించడంతో భారత్ ఏకంగా నలుగురితో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు. టోర్నీలో భారత్ స్పిన్నర్లు 26 వికెట్లు తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్లు ఎక్కువగా బౌలింగ్ చేయడంతో కీపర్ కేఎల్ రాహుల్ కష్టపడాల్సి వచ్చింది.
వికెట్స్ వెనకాల తాను ఎలా కష్టపడ్డాడనే దానిపై జస్ప్రీత్ బుమ్రా సతీమణి, టీవీ ప్రజెంటర్ సంజనా గణేశన్కు కేఎల్ రాహుల్ వివరించాడు. మ్యాచ్ అనంతరంరాహుల్ను సంజనా ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వికెట్ల వెనకాల మీ అనుభవం ఎలా ఉంది అని సంజనా అడగ్గా.. దూలతీరిపోయింది అనే సమాధానం ఇచ్చాడు. ‘కీపింగ్ అంత జోక్ కాదు సంజనా. స్పిన్నర్ల బౌలింగ్లో వికెట్ల వెనుక 200-250 సార్లు కుర్చోవడం, లేవడం చేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్లు ఎంతో ప్రతిభావంతులు. దుబాయ్ మైదానంలోని పిచ్లు కూడా వారికి సహకరించాయి. పిచ్లు స్పిన్కు అనుకూలించడంతో.. స్టంప్స్ వెనక నాకు మరింత సవాలు ఎదురైంది. భారత స్పిన్నర్లు అద్భుతం. వారు బౌలింగ్ చేసిన విధానం, పరిస్థితులను ఉపయోగించుకున్న తీరు అసాధారణం’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
‘ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవడం అంత సులువు కాదు. ఇది నాకు మొదటి ఐసీసీ టైటిల్ కాబట్టి చాలా సంతోషంగా ఉన్నా. ఇది జట్టు విజయం. అందరూ బాగా ఆడారు. నేను గత సంవత్సర కాలంగా బాగా కష్టపడ్డాను. ఎంతో శ్రమించాను. ఫలితం ఇప్పుడు వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు. ప్రధాన కీపర్ రిషబ్ పంత్ ఉన్నా.. రోహిత్ మాత్రం రాహుల్పై నమ్మకం ఉంచాడు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!