గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా గోల్డ్ రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిపెరిగిన పసిడి.. నేడు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.300.. 24 క్యారెట్లపై రూ.330 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (మార్చి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,200గా.. 24 క్యారెట్ల ధర రూ.87,490గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. వరుసగా రెండో రోజు తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.98,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా కొనసాగుతోంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.998,000గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,200
విజయవాడ – రూ.80,200
ఢిల్లీ – రూ.80,350
చెన్నై – రూ.80,200
బెంగళూరు – రూ.80,200
ముంబై – రూ.80,200
కోల్కతా – రూ.80,200
కేరళ – రూ.80,200
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.87,490
విజయవాడ – రూ.87,490
ఢిల్లీ – రూ.87,640
చెన్నై – రూ.87,490
బెంగళూరు – రూ.87,490
ముంబై – రూ.87,490
కోల్కతా – రూ.87,490
కేరళ – రూ.87,490
Also Read: Ravindra Jadeja: దయచేసి పుకార్లు పుట్టించకండి.. హగ్ చేసుకుంటే..?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.98,000
ముంబై – రూ.98,000
చెన్నై – రూ.1,07,000
కోల్కతా – రూ.98,000
బెంగళూరు – రూ.98,000
కేరళ – రూ.1,07,000