ఈ నెల 9న మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో TASK నేతృత్వంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ లోని I.T టవర్ లో ఉన్న కంపెనీలకు ఐటీ ఉద్యోగుల కోసం ఈ జాబ్ మేళా. లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని, పాలమూరు.. మట్టి మోసే లేబర్ నుంచి నేడు ఐటీ ఉద్యోగుల దాకా వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, srinivas goud, brs
బీజేపీ ఎంపీ సోయం బాబు రావు చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లంబాడీ, కోయ కమ్యూనిటీ వేరు వేరు కాదని, రాజ్యాంగం సవరణ చేశాక లంబాడీ లను ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. breaking news, latest news, telugu news, balaram naik
ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 118 జీవో సమస్య పరిష్కారం అయిందని, ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ఇండ్లు రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్నారన్నారు. breaking news, latest news, telugu news, minister ktr, big news, lb nagar,
ఆర్టీసీపై కేసీఆర్ది ఎన్నికల కపట ప్రేమ అన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ విలీన ప్రకటన చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ హడావిడి ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. breaking news, Latest news, telugu news, cm kcr, ramulu naik, big news,
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎపుడు బయట పడాలి అని చాలా మంది నాయకులు అనుకుంటున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అందుకే కాంగ్రెస్లో భారీగా చేరికలు జరుగుతున్నాయని, షర్మిల చేరిక అంశం నా దృష్టిలో లేదు ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలను కలుస్తున్నట్లు, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏదీ నెరవేరలేదని, నా పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నో కళ్ళారా చూశానన్నారు భట్టి విక్రమార్క. breaking news, latest news, telugu news,…
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాలమూరు జిల్లాకు చెందిన ఇతర నేతలు కాంగ్రెస్లో చేరనున్నారు. పాలమూరు జిల్లా కొల్లాపూర్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రసంగించే భారీ బహిరంగ సభలో జూపల్లి తదితరులు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా సభ వాయిదా పడింది. breaking news, latest news, telugu news, jupalli krishan rao, congress,