MLC Jeevan Reddy : నా ప్రజా జీవితం ప్రారంభించింది ధరూర్ గ్రామం నుండే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నా ప్రజా జీవితం ప్రారంభించింది ధరూర్ గ్రామం నుండే అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంత ఎపుడు జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తుంది, బిఆర్అస్ ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతంపై విశ్వాసం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వస్తాయి పోతాయి.. ఎన్నికలలో నేను గెలిచినా అన్ని సార్లు ఎవరు గెలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఓడినన్ని సార్లు ఎవరు ఓడలేరు… గెలిచినా ఓడిన ప్రజల మధ్య ఉన్నానని ఆయన పేర్కొన్నారు. నేను గెలువలేకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నా అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. నేను ప్రశ్నించే గొంతుకనే కాకుండా, సమస్యలను పరిష్కరించేవాడిని కూడా అని ఆయన తెలిపారు.
ఒక్క పంట పొతే వ్యవసాయాన్ని ఇడిసిపెడతామా.. అలాగే ఒక్క ఎలక్షన్ పోతే ఇంకో ఎలక్షన్ వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గ్రామ పంచాయతీల నిధులు వస్తాయని స్పష్టం చేశారు. మత్స్యకారుల సహకార సంఘానికి చేపనారు కోసం నేరుగా వారి ఖాతలో డబ్బులు వేసేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని, అందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. పింఛన్లను పెంచడంతోపాటు గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. అర్హులందరికీ పథకాలు అందుతాయని వెల్లడించారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?