Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp K Laxman Praised Narendra Modi

MP K.Laxman : 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం

Published Date :January 24, 2024 , 4:09 pm
By Gogikar Sai Krishna
MP K.Laxman : 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాముడు జన్మించిన పుణ్యభూమిలో రామమందిరం నిర్మించాలని ప్రపంచంలోని సనాతన ధర్మీయులు ఎన్నో కలలుగన్నారని… ముఖ్యంగా భవ్య మందిర నిర్మాణంలో కరసేవకుల పాత్ర కీలకమని, వారి త్యాగం చిరమస్మరణీయమని కొనియాడారు. ఎంతోమంది వారి జీవితాలను త్యజించి, కుటుంబాలను వదులుకొని సుదీర్ఘ పోరాటం చేశారని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చిందని డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. అయితే సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే కొన్ని రాజకీయ పార్టీలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారు.. చివరికి వారే నాశనమవ్వక తప్పదని హెచ్చరించారు. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పుస్తకాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ రామనామ సంవత్సర శుభాకాంక్షలు. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పుస్తకాన్ని ముద్రించింనందుకు అభినందనలు తెలిపారు. 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరిగిందన్నారు. రాముడు జన్మించిన పుణ్యభూమిలో రామమందిరం నిర్మించాలని ప్రపంచంలోని సనాతన ధర్మీయులు ఎన్నో కలలుగన్నారని ఆయన తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో కరసేవకులు చూపిన చొరవ స్ఫూర్తిదాయకమని, కరసేవలో పాల్గొన్న కరసేవకులు అందరికీ పాదాభివంనాలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. బాబర్ భారతదేశం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించి అయోధ్యలోని రామమందిరంపై దాడి చేసి వివాదస్పద కట్టడాన్ని(మసీదు)ను నిర్మించాడన్నారు.

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

అంతేకాకుండా.. ‘ఆనాడు విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు సాధుసంతులు, దైవ భక్తులు, దేశభక్తులు సుదీర్ఘపోరాటం చేశారు. వీహెచ్‌పీ తలపెట్టిన కార్యక్రమానికి బీజేపీ మద్దతిస్తూ తీర్మానం ప్రకటించింది. గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని ఎల్‌కే అ‍ద్వానీ గారు సంకల్పించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, నిద్రమత్తులో తూగుతున్న శాసనకర్తలకు బుద్ధివచ్చేలా అధ్వానీ గారు గుజరాత్ నుంచి సోమనాథ్ రథయాత్ర ప్రారంభించారు. రథయాత్ర ద్వారా అధ్వానీ గారు దేశంలోని హిందువుల్లో చైతన్యం నింపారు.
కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ముసుగులో హిందువుల మనోభావాలను కించపర్చడం, ఆలోచనలను వ్యతిరేకిస్తూ మోసం చేస్తూ వచ్చింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంలో పాత్ర పోషించిన రాజేంద్రస్రాద్ గారు ఆలయ ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని నెహ్రూ గారిని ఆహ్వానిస్తే తిరస్కరించారు. సోమనాథ్ దేవాలయ ప్రారంభోతద్సవంలో తాము భాగస్వామ్యం కామని నాడు కాంగ్రెస్ తేల్చిచెప్పింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం అనేకమంది కరసేవకులు, హిందువులు పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారు. మతోన్మాద రక్కసిమూకల చేతిలో వేలాది మంది సాధుసంతులు, హిందువులు, కరసేవకులు బలిదానమయ్యారు. నరేంద్ర మోడీ కారణజన్ముడిగా ప్రధానిగా అయినప్పటి నుంచి దేశంలోని అనేక సమస్యలకు పరిష్కారమార్గం చూపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూపీ ప్రభుత్వం సహాయంతో అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం నిర్మాణం సాకారం చేశారు. సోమనాథ్ మందిరం, కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు దేశంలో అనేక పవిత్ర క్షేత్రాలకు పూర్వవైభవం సంతరించుకుంది. పేదల సంక్షేమం కోసం కులమతాలకు అతీతంగా నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. దేశంలో ప్రధాని మోదీ గారి సుపరిపాలన చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. నాడు ఎంతోమంది ఉద్యమకారుల రక్తతర్పణతో విలవిలలాడి సరయూనది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టతో నేడు దీపాలతో పవిత్రమైంది. కోట్లాది మంది ప్రజల ప్రతినిధిగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ వస్తోంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎక్కడా ప్రత్యేక పూజలు నిర్వహించకూడదంటూ హుకుం జారీ చేసి దుర్మార్గంగా వ్యవహరించింది. ఆంగ్లేయులు మొదలు మొఘలాయిలు, ఔరంగజేబు, మీర్ బాకీలు సనాతన ధర్మం వినాశనం కోసం ప్రయత్నించారు. చివరికి వారే నాశనమయ్యారు. ధర్మాన్ని వినాశనం చేయాలని కోరుకువారు చివరికి వారే నాశనమవుతారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • MP K Laxman
  • telugu news

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions