Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ (SIT) ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చినప్పటికీ, తాజాగా ఈ రక్షణను తొలగించి, కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు విచారణకు ఏ […]
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని సీబీఐ కోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివేకా కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్లో చేసిన వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ, కొన్ని షరతులతో ఆమె అభ్యర్థనకు అనుమతి తెలిపింది. వివేకా హత్య కేసులో కోర్టు ఆదేశిస్తే అదనపు దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ […]
ముగ్గురు మంత్రులు, అదీ…. ముఖ్యమైన పోర్ట్ఫోలియోల్లో ఉన్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు గ్లోబల్ సమ్మిట్ బిజీలో ఉంటే… అక్కడ లోకల్గా పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు వాతావరణం ఎలా ఉంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే…మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పక్షానివే. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే, అటు భద్రాచలంలో బీఆర్ఎస్ […]
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్, అక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… దేవుళ్ల మీద ఒట్టేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల […]
Local Body Elections : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఈ విడతలో మొత్తం 4,158 సర్పంచ్ స్థానాలకు గాను 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాల కోసం మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటాపోటీగా బరిలో నిలిచారు. కాగా, అనివార్య కారణాల వల్ల 11 సర్పంచ్ స్థానాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. Tragedy: “చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్ఫ్రెండ్ […]
పంచాయతీ పోరు ఆ ఎంపీలకు ప్రెస్టీజ్ ఇష్యూ అయిందా? అందుకే ఆఫర్స్ మీద ఆఫర్స్…. బంపరాఫర్స్ అంటూ పల్లె ఓటర్స్ను టెంప్ట్ చేస్తున్నారా? మేటర్ చివరికి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ హామీ దాకా వెళ్ళిపోయిందా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏ పార్టీ ఎంపీలు అలా హామీల వరద పారిస్తున్నారు? తెలంగాణలో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా జరుగుతోంది. ఇవి పార్టీలకు అతీతమైన ఎన్నికలైనా, ఆ సింబల్స్తో సంబంధం లేకున్నా…. అన్ని పార్టీల కేడర్ హడావిడి మాత్రం తగ్గడం […]
సాధారణంగా… సమ్మర్ హీట్లో సైతం కూల్కూల్గా కనిపించే ఆ కేంద్ర మంత్రి ఇప్పుడు ఇంత చలికాలంలోనూ ఎందుకు గరం గరంగా మారిపోయారు? ఓ జిల్లాకు జిల్లా పార్టీ నేతలు మొత్తాన్ని నిలబెట్టి కడిగేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జిల్లా నాయకులు ఒకటి తలిస్తే… సెంట్రల్ మినిస్టర్ మరోటి అనుకున్నారా? ఎవరా మంత్రి? ఏ జిల్లా నాయకులతో ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నారు? నల్లగొండ జిల్లా కమలం నేతలకు ఓ రేంజ్లో క్లాస్లు పడ్డాయట. సాధారణంగా ఎప్పుడూ సౌమ్యంగా […]
Shocking : హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమే కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిపించి బ్యాట్లతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బీరంగూడ ప్రాంతానికి చెందిన సాయి (20), అదే ప్రాంతానికి చెందిన యువతి (19) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పెళ్లి విషయంపై మాట్లాడతామని సాయిని […]
Anesthetic Injections : హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకున్న మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది. మత్తు కోసం అనస్తీషియా ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి చెందిన ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేయగా, వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా కీలక విషయాలు కలకలం రేపుతున్నాయి. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు కొంతకాలంగా మత్తు కోసం ఇంజెక్షన్లకు అలవాటు పడ్డారు. సాధారణ మత్తు […]
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా, కేసు దర్యాప్తునకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థతో ఏమాత్రం సహకరించడం లేదని, దర్యాప్తు సంస్థతో ఆయన ఆటలాడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, కీలకమైన రుజువులను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో […]