Komatireddy Venkat Reddy : అసెంబ్లీకి రా.. నీ పదేళ్ల పాపాల లెక్కలు తేలుస్తాం
- కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్
- 24 నెలలుగా అసెంబ్లీకి రాని కేసీఆర్
- పదేళ్ల అప్పుల లెక్కలు చెప్పాలి
- అసెంబ్లీలోనే తేల్చుకుందాం : మంత్రి కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే, గత పదేళ్ల కాలంలో ఆయన చేసిన అప్పులు, అక్రమాలపై లెక్కలు తేలుస్తామని మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్ష నేతకు కూడా ప్రజా సమస్యల పట్ల అంతే బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
24 నెలల అజ్ఞాతం ఎందుకు?: గత 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి సభకు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేసే పనులకు లెక్కలు అడిగే హక్కు కేసీఆర్కు లేదని, ముందుగా ఆయన హయాంలో చేసిన వేల కోట్ల అప్పుల లెక్కలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. “నీ ఆస్తుల లెక్కలు చెప్పు.. ప్రజల సొమ్ముతో ఎంత సంపాదించావో అందరికీ తెలుసు” అంటూ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
ప్రజలు సున్నా ఇచ్చారు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ‘బిగ్ జీరో’ (సున్నా) ఇచ్చి బుద్ధి చెప్పారని, అయినా కేసీఆర్ తీరులో మార్పు రాలేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో తమకు హోదా లేకపోయినా భట్టి విక్రమార్క వంటి నేతలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారని, ప్రస్తుతం పార్లమెంట్లో మల్లికార్జున ఖర్గే గారు గట్టిగా నిలదీస్తున్నారని, మరి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
అసెంబ్లీలో తేల్చుకుందాం: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా రావాలని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. సభకు వస్తే పదేళ్లలో జరిగిన అవినీతి, అప్పులు , ఇతర అభివృద్ధి పనులపై తాము సిద్ధం చేసిన లెక్కలను కేసీఆర్ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కేవలం ఫాంహౌస్కే పరిమితం కాకుండా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను నెరవేర్చాలని హితవు పలికారు.
Droupadi Murmu: చరిత్ర సృష్టించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
తాజావార్తలు
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!