తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జలాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, అవసరం అయితే ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
జులరామారం పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ సర్వే నంబర్ 307లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు, సిబ్బందిపై స్థానికులు తీవ్ర ప్రతిఘటనకు దిగారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించింది.
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే యూఎస్ కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
HYDRA : అల్వాల్ మండలంలోని కౌకూరు ప్రాంతం వరద ముప్పు నుంచి బయటపడింది. కౌకూరుకుంట–నాగిరెడ్డికుంట మధ్య అనుసంధాన కాలువను హైడ్రా అధికారులు పునరుద్ధరించడం ఇందుకు కారణమైంది. కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం జరిగిందని స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా విచారణ జరిపి గోడ నిర్మాణం నిజమని నిర్ధారించింది. వెంటనే కూల్చివేత చర్యలు చేపట్టింది. CM Revanth Reddy : గద్దెలు యథాతథంగా.. ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సీఎం మేడారంకు వెళ్లి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
అన్నదమ్ముల మధ్య బంగారం చిచ్చు పెట్టింది. బంగారం కోసం.. బంధాన్ని కూడా మర్చిపోయారు. ఏకంగా అన్న కుటుంబంపై తమ్ముడు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బంధాన్ని పక్కకు పెట్టి అన్నదమ్ములు కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు.
తెలంగాణ ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పలు చిన్న పార్టీలకు గుర్తింపు రద్దు హెచ్చరికగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం, అవసరమైన పత్రాలు సమర్పించని లేదా షరతులు పూర్తి చేయని పార్టీలు ఈ చర్యకు లక్ష్యమయ్యాయి.