TPCC Mahes Goud : ప్రజలతో మమేకమే లక్ష్యం
- ప్రజలతో మమేకం కావడమే పాదయాత్ర లక్ష్యం
- గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు.. పాదయాత్రల ప్రేరణ
- సీఎం రేవంత్ రెడ్డి తదుపరి పాదయాత్రలో పాల్గొననున్న విషయంపై వెల్లడి
- వెన్నుపోటు అయినా సంక్షేమ పథకాల అమలులో రాజీ లేదు : టీపీసీసీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahes Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం, వారి సమస్యలు తెలుసుకోవడం అని ఆయన స్పష్టంగా తెలిపారు.
“మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్రను ప్రారంభించాం. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న వాస్తవాలను నేరుగా తెలుసుకోవడానికి, వారి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఇదొక సాధనంలా వుంది,” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Also Read
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
IND vs ENG: పెవిలియన్కు వరుస పెట్టిన టీమిండియా బ్యాటర్లు.. భారత్ 224 ఆలౌట్!
గాంధీ యాత్రల నుండి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వరకు పాదయాత్రలు దేశ ప్రజలను చైతన్యపరిచిన ఉదాహరణలుగా నిలిచాయని గౌడ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలు కూడా ప్రజల్లో కొత్త ఆశలు నింపాయన్నారు. అదే దారిలో టీపీసీసీ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
ఈ యాత్రలో ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తదుపరి పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పులతో తాము అధికారం చేపట్టామని, అయినప్పటికీ ప్రతి నెలా 6 వేల కోట్ల అప్పు చెల్లిస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గౌడ్ వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిబంధనపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రజల ఆకాంక్షలకే స్పందనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వారికి న్యాయం చేయడమే మా లక్ష్యం,” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
CM Chandrababu: తోక తిప్పితే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!