Bhatti Vikramarka : పనులు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరిగిపోతుంది
- యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనలో భాగంగా మంత్రుల పర్యటన
- 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న యూనిట్లు
- మిగిలిన యూనిట్ల పనులు డిసెంబర్ నాటికి పూర్తి
- నిర్వాసితులకు విద్యా, వైద్య సదుపాయాల హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ ప్లాంట్లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. మిగిలిన మూడు యూనిట్ల పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, రిపబ్లిక్ డే నాటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు, సమస్యల పరిష్కారంలో కూడా అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. పనులు ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఆర్ధికంగా భారితనాన్ని మోస్తుందని ఆయన పేర్కొన్నారు.
ENG vs IND: అందరికీ ఛాన్స్లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్లోకి వెళ్లాడు
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చొరవ తీసుకున్నందువల్లే రెండు యూనిట్లు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగలిగామని చెప్పారు. మిగిలిన యూనిట్లను కూడా తక్షణమే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వారి పిల్లలకు విద్యా, వైద్య సేవలు అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. అంతేకాక, ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు కూడా అత్యుత్తమ విద్యా, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో భూ నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వారికి న్యాయమైన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు ఆ బాధితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Trump Tariffs: భారత్కు 25 శాతం టారిఫ్.. పాకిస్తాన్కు మాత్రం ఊరట..
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..