Gogikar Sai Krishna
Author- NTV Telugu-
గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
గడ్డి అన్నారంలో గల మార్కెట్ను తరలించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మార్కెట్ను తరలించవద్దని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. అలాగే బాటసింగారం వెళ్లేందుకు వ్యాపారులకు హైకోర్టు నెల గడువు ఇచ్చింది. నెల రోజుల్లో ప్రభుత్వం బాటసింగారంలో […] -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూర్ మండలం గుర్తుర్ గ్రామ శివారులోని ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నర్సంపేట నుండి తొర్రూర్ కు ఆర్టీసీ బస్సు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంలో […] -
ఒమిక్రాన్ వేళ.. రేపు తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక సమావేశం
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే భారత్లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ రోజుకో రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇటీవల తెలంగాణాకు పక్కనే ఉన్న ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్పై అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో థర్డ్వేవ్ను ఎదుర్కొనే ప్రణాళికలపై […] -
బీసీలకు అండగా కాంగ్రెస్ ఉంటుంది : రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల కులగణన చేస్తామని, బీసీల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీసీల లెక్కలను తీయడంలో […] -
లైవ్ : పీఆర్సీపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్
ఎప్పటినుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఏపీ సీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు పీఆర్సీతో పాటు తమ న్యాయమైన 71 డిమాండ్లను కూడా పరిశీలించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం సీఎస్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. -
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్.. సర్వం సిద్ధం : శశాంక్ గోయల్
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ల మధ్య తెరుస్తారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. […] -
రాహుల్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్..
భారతదేశం హిందువుల దేశమని, హిందూ, హిందుత్వవాదం మధ్య తేడాను నిర్వచిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తన ట్వీట్లో “రాహుల్, కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి భూమి కట్టబెట్టాయి. ఇప్పుడు వారు మెజారిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2021లో హిందువులను అధికారంలోకి తీసుకురావడం ‘సెక్యులర్’ ఎజెండా. వా! భారతదేశం భారతీయులందరికీ చెందుతుంది. ఒక్క హిందువులే కాదు. భారతదేశం అన్ని విశ్వాసాల ప్రజలకు మరియు విశ్వాసం […] -
పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయ నేతల్లో మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో పవన్ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించి వైసీప ఎమ్మెల్య అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర చేతుల్లో ఉందని ఈ నేపథ్యంలో పవన్ బీజేపీ ప్రభుత్వం పోరాటం చేయాలని సూచించారు. […] -
లైవ్ : వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ నిన్న దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో పవన్ మాటలపై నేడు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. -
డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ఉద్యోగుల ర్యాలీ..
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ సహా న్యాయమైన 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే పోరాటం ఆపుతామని వారు స్పష్టం చేశారు. సచివాలయ […]
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!