కరోనా వైరస్ మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రధాని మోడీ ధర్డ్వేవ్పై సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాపై ఆంక్షలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, మందుల పంపిణీ, ముందస్తు నిల్వలు వంటి కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని, కంటైన్మెంట్ […]
రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు కేసీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ల అనుమతుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి […]
భారత్లోకి ప్రవేశించేందుకు పాకిస్తానీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్కు చెందిన ఓ బోట్ ప్రవేశించడంతో స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందిన బోట్లో ఉన్న 10 మందిని గుజరాత్ తీరరక్షక దళం అదుపులోకి తీసుకుంది. అయితే పట్టుబడ్డిని వారిని విచారణ నిమిత్తం పోర్ బందర్కు గుజరాత్ తీరరక్షక దళం తరలించింది. గుజరాత్లో గత నెల 20న కూడా భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్కు చెందిన ఓ బోట్ను గుజరాత్ […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రి సీఎం కేసీఆర్ ముచ్చింతల్లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం లాంటి ఏర్పాట్లపై చినజీయర్తో చర్చించనున్నారు. అంతేకాకుండా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం […]
సంక్రాంతి పండుగంటేనే కోళ్ల పందేలకు ఫేమస్.. ఎంతో హుషారుగా కాయ్రాజాకాయ్ అంటూ యువతతో పాటు స్థానిక ప్రముఖులు కూడా ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే ఈ కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. ఆ తరువాత 2018 జనవరిలో కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ కోడి పందేలకు ఎక్కువగా ఆతిథ్యమిస్తుంటాయి. […]
తెలంగాణ రాష్ట్ర, చారిత్రాత్మక హన్మకొండ నగర అభివృద్ధిని వీక్షించేందుకు విచ్చేస్తున్నా బీజేపీ కేంద్ర నాయకత్వానికి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మకి స్వాగతమని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చారిత్రక నగరం హన్మకొండకు వచ్చే ముందు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చిన తరువాత నగరంలో అడుగు పెట్టండని ఆయన అన్నారు. వరంగల్ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి […]
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్డౌన్తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు. […]
శంషాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందింది. వివరాల్లో వెళితే.. శంషాబాద్ పరిధిలోని తేజస్విని స్కానింగ్ సెంటర్కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌదరిగుడా గ్రామానికి చెందిన కవిత అనే మహిళ స్కానింగ్ కోసం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తేజస్విని స్కానింగ్ సెంటర్ సిబ్బంది కవితకు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం కవిత మృత్యవాత పడింది. దీంతో కవిత మృతికి తేజస్విని స్కానింగ్ సెంటర్ […]
ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే […]
కరోనా రక్కసి మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజు భారీగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల క్రితం దేశవ్యాప్తంగా రోజుకు 50 వేల లోపు నమోదవుతున్న కరోనా కేసులు సంఖ్య తాజాగా లక్షన్నరకు చేరువలో నమోదవుతున్నాయి. దీనిబట్టే అర్థచేసుకోవచ్చు కరోనా ఏ రేంజ్లో వ్యాప్తి చెందుతుందోనని. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం ముంబాయిలోనే 20వేలకుపైగా కేసులు […]