Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Duddilla Sridhar Babu : రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. చెన్నూరుకు ఎత్తిపోతల పథకం మంజూరు చేసి మంథని ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం దురదృష్టకరమన్నారు. మంథని ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న […] -
MP Dharmapuri Arvind : ఇన్ని ఏళ్లుగా.. ఆకులు పీకుతున్నారా అయ్యా కొడుకులు
ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పాగల్ అయిపోయిండా అని చర్చ జరుగుతుందని, మనిషి పిచ్చికుక్కను కలిస్తే కేటీఆర్లా అవుతాడని, నాటు వైద్యమే దీనికి మందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్కి పచెంబ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆముదం తీట కోయిలాకు పూసి పచ్చి చింత బరిగెలతో కొట్టడమే ఆ ట్రీట్ మెంట్…తోలు దొడ్డు అయిందన్నారు. ఎగిరే గుర్రం […] -
CEO Telangana : డబుల్ ఓట్లు ఉన్నవారిని గుర్తిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్లు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ సాగుతోందని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా సాఫ్ట్వేర్, యాప్ ద్వారా ప్రక్రియ కొనసాగుతోందని, పేర్లు వేరుగా, అడ్రస్ లు వేరుగా పెట్టి డబుల్ ఓట్లు ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈఆర్వో వాటిని గుర్తించి సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తారన్నారు. డూప్లికేట్ ఓట్లు ఉండొచ్చు, అనివార్యకారణాల వల్ల కొన్ని ఫోటోలు వేరుగా ఉండి కూడా నమోదు అవుతున్నాయని […] -
Ukraine War : పుతిన్ బెదిరింపులు ఉత్తుత్తివేనా..?
ఉక్రెయిన్ తో యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతున్న వేళ రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా దీనిని పేర్కొంటున్నారు. ఎలాంటి క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఇది ఛేదించగలదు. క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ అని ప్రెసిడెంట పుతిన్ స్వయంగాప్రకటించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ డెడ్లీ మిసైల్ పేరు సర్మత్. రష్యా అమ్ములపొదిలో వున్న కింజల్, అవాంగార్డ్ క్షిపణుల సరసన త్వరలో సర్మత్ చేరనుంది. అప్పుడు రష్యా వైపు చూడాలంటే శత్రువులు […] -
Weather Update : సూర్యుడు వర్సెస్ వరుణుడు.. చల్లబడ్డ హైదరాబాద్..
భానుడి భగభగతో తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఉదయం నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవికాలం ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో తెలంగాణ వాసులు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో ఎండతీవ్రత అంచనాలకు మించి ఉండడంతో విద్యాసంస్థల పనివేళల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భాగ్యనగరంలో ఉక్కపోతకు ప్రజలు చెమటలు కక్కుతున్నారు. హై స్పీడ్లో ఫ్యాన్లు, కూలర్లు, […] -
Hyderabad Metro : ప్రయాణికుల కోసం ఈ-ఆటోలు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఈ ఆటోలను పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎండీ ఎన్.వి.యస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో హైదరాబాద్ మెట్రో రైల్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వెల్లడించారు. కరోనాకు ముందు రోజుకు 4 లక్షల మంది మెట్రో లో ప్రయాణించే వారని, ప్రస్తుతం రోజుకు 2.7లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణపై కొందరు ఇష్టం వచ్చినంటూ మాట్లాడుతున్నారని, ప్రపంచంలోనే ఇంత పెద్ద మెట్రో […] -
Renuka Chowdhury : 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతా
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని ఆమె వెల్లడించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని, మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్..పువ్వాడ బిజినెస్ పార్టనర్లు అని, కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఏసీపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఓ వైపు […] -
DH Srinivasa Rao : ఫోర్త్ వేవ్ పై కీలక ప్రకటన..
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చైనాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. చైనా, తైవాన్, ఈజిప్టు లో కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీ, హర్యానా, యూపీ లో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎలాంటి […] -
Crime News : టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య..
మహబూబాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. మెడ భాగంలో దాడి జరగడంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రవిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా […] -
Dasoju Sravan : అవి టీఆర్ఎస్, బీజేపీ పైసలు కాదు.. ప్రజలు కట్టిన టాక్స్లు..
కేటీఆర్ ఫ్రస్టేషన్తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ వచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్ లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది […]
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..