ED Raids : లగ్జరీ కార్ల వెనకున్న బసరత్ ఖాన్ రహస్యాలు..?
- లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు..
- ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు..
- బసరత్ ఖాన్ ఇప్పటికే అరెస్టు చేసిన అహ్మదాబాద్ ఈ డి అధికారులు.
- హైదరాబాదులో లగ్జరీ ఇంపార్టెంట్ కార్ల విక్రయాల డీలర్ గా ఉన్న బసరత్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids : హైదరాబాద్లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో భాగంగా, స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసిన హైఎండ్ కార్ల వ్యవహారాలపై అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
బసరత్ ఖాన్ ఇప్పటికే అహ్మదాబాద్ ఈడీ అధికారుల చేత అరెస్టు కాగా, గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. అమెరికా, జపాన్ నుండి దిగుమతి చేసిన లగ్జరీ కార్లను దుబాయ్, శ్రీలంక మార్గం ద్వారా తెచ్చి, ఎడమ స్టీరింగ్ వాహనాలను కుడివైపు స్టీరింగ్గా మార్చి, తక్కువ ధరకు డిక్లేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తప్పుడు డాక్యుమెంట్ల కారణంగా ప్రభుత్వానికి దాదాపు ₹25 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విచారణలో ఖాన్ అనేక వాహనాలను అండర్వాల్యూ చేసినట్లు అంగీకరించాడు. టయోటా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయిస్ కలినన్, లెక్సస్ LX-500D వంటి కార్లను తక్కువ ధరకు చూపించానని, ఎనిమిది వాహనాలపై తక్కువగా చెల్లించిన డ్యూటీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సమయం కావాలని అధికారులకు తెలిపాడు.
Also Read
ఈ వ్యవహారం రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్—“కార్ పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా? KTR ఎందుకు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లో కనిపిస్తున్నాడు?” అంటూ ప్రశ్నించారు. దీనిపై బిఆర్ఎస్ నేతలు స్పందిస్తూ, “ఆ కార్ సాధారణ కొనుగోలు ప్రక్రియలోనే తీసుకున్నారు. అదే ఖాన్ వద్ద నుండి కాంగ్రెస్ మంత్రి కూడా వాహనం కొనుగోలు చేశారు. దానిని ఎందుకు ప్రస్తావించడం లేదు?” అని ప్రతిఉత్తరం ఇచ్చారు.
దర్యాప్తులో మాజీ బిఆర్ఎస్ మంత్రితో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక సిట్టింగ్ మంత్రి కూడా ఖాన్ వద్ద నుండి లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం బయటపడింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య వాదోపవాదాలు ముదురుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈడీ, DRI దర్యాప్తులు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!