Airtel: 37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్..స్పందించిన ఎయిర్టెల్
- 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని పేర్కొన్న హ్యాకర్
- కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్లో విక్రయానికి ఉంచినట్లు ప్రకటన
- ఒక్కసారిగా ఆందోళనకు గురైన వినియోగదారులు
- తమ సిస్టమ్ల నుంచి ఎటువంటి ఉల్లంఘన జరగలేదని నిర్ధారించిన ఎయిర్టెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్లో విక్రయానికి ఉంచుతున్నట్లు ఓ హ్యాకర్ తాజాగా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా వినియోగదారులు కంగారు పడ్డారు. ఇది భారతదేశంలో ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా ఈ ప్రకటనపై ఎయిర్టెల్ స్పందించింది.
READ MORE: CM Chandrababu: ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం..
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- 8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ఎయిర్టెల్ ఇండియా డేటా ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ.. తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, ఎయిర్టెల్ సిస్టమ్ల నుంచి ఎటువంటి ఉల్లంఘన జరగలేదని నిర్ధారిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. డార్క్ వెబ్ ఇన్ఫార్మర్ ద్వారా వెలువడిన తప్పుడు డేటా ఉల్లంఘనగా దీన్ని అభివర్ణించింది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే అంతకు ముందు డార్క్ వెబ్లో ఓ పోస్ట్ ప్రకారం, ‘xenZen’ అనే మారుపేరుతో హ్యాకర్ 37.5 కోట్ల మంది ఎయిర్టెల్ ఇండియా కస్టమర్ల మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ ఐడీ, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలతో కూడిన డేటాబేస్ను విక్రయానికి ప్రయత్నించాడు. క్రిప్టోకరెన్సీలో చెల్లించాల్సిన దీనికి 41 లక్షల రేటు పెట్టాడు. దీంతో కస్టమర్లు కంగారు పడ్డారు. స్పందించిన టెలికాం కంపెనీ తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడని..ప్రకటించింది.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!