Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చాలని ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. అయితే, ఇప్పటికే నడుస్తున్న కొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ ట్రైన్లుగా మార్చారు.
కాచిగూడ – ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్
రైలు నం. 07191/07192 కాచిగూడ–మధురై స్పెషల్ రైలును ఇప్పుడు 17165/17166 కాచిగూడ–ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మంగళవారం రాత్రి 10:45 గంటలకు ట్యూటికోరిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం బయలుదేరి గురువారం మధ్యాహ్నం కాచిగూడ చేరుకుంటుంది.
Also Read
హైదరాబాద్ – కన్యాకుమారి ఎక్స్ప్రెస్
రైలు నం. 07230/07229 హైదరాబాద్–కన్యాకుమారి స్పెషల్ రైలును ఇప్పుడు 17069/17070 రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం బయలుదేరి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటుంది.
చర్లపల్లి – షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
రైలు నం. 07225/07226 చర్లపల్లి–షాలిమార్ స్పెషల్ రైలును ఇప్పుడు 17065/17066 Amrit Bharat Express గా మార్చారు. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం షాలిమార్ రైల్వే స్టేషన్కు (పశ్చిమ బెంగాల్) చేరుకుంటుంది.
ఇక, ఈ నిర్ణయంపై కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి Ashwini Vaishnaw కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ₹36,286 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించగా ప్రస్తుతం ₹47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా రూ. 2,668 కోట్లతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను Amrit Bharat Station Scheme కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు కిషన్ రెడ్డి..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!