Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చాలని ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. అయితే, ఇప్పటికే నడుస్తున్న కొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ ట్రైన్లుగా మార్చారు.
కాచిగూడ – ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్
రైలు నం. 07191/07192 కాచిగూడ–మధురై స్పెషల్ రైలును ఇప్పుడు 17165/17166 కాచిగూడ–ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మంగళవారం రాత్రి 10:45 గంటలకు ట్యూటికోరిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం బయలుదేరి గురువారం మధ్యాహ్నం కాచిగూడ చేరుకుంటుంది.
Also Read
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
హైదరాబాద్ – కన్యాకుమారి ఎక్స్ప్రెస్
రైలు నం. 07230/07229 హైదరాబాద్–కన్యాకుమారి స్పెషల్ రైలును ఇప్పుడు 17069/17070 రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం బయలుదేరి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటుంది.
చర్లపల్లి – షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
రైలు నం. 07225/07226 చర్లపల్లి–షాలిమార్ స్పెషల్ రైలును ఇప్పుడు 17065/17066 Amrit Bharat Express గా మార్చారు. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం షాలిమార్ రైల్వే స్టేషన్కు (పశ్చిమ బెంగాల్) చేరుకుంటుంది.
ఇక, ఈ నిర్ణయంపై కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి Ashwini Vaishnaw కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ₹36,286 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించగా ప్రస్తుతం ₹47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా రూ. 2,668 కోట్లతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను Amrit Bharat Station Scheme కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు కిషన్ రెడ్డి..
తాజావార్తలు
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!