Rahul Gandhi: లోకో పైలట్లతో రాహుల్ సమావేశం..తరచూ రైలు ప్రమాదాలకు కారణాలు ఇవే..?
- లోకో పైలట్ల బాగోగులను అడిగి తెలుసుకున్న రాహుల్
- సమావేశానికి దేశ నలుమూలల నుంచి 50 మంది లోకో పైలట్లు
- ప్రమాదాలకు గల కారణాలు తెలిపిన లోకో పైలెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకో పైలట్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను కూడా విన్నారు. ఈ సమావేశానికి సంబంధించి, రాహుల్ గాంధీ భారతదేశం నలుమూలల నుంచి 50 మంది లోకో పైలట్లను కలిశారని కాంగ్రెస్ తెలిపింది. వారు ఆయనకు తన సమస్యలు చెప్పుకున్నారు. లోకో పైలట్లు తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వారు ఇంటి నుంచి దూరంగా సుదూర ప్రాంతాలకు రైళ్లను నడుపుతారు. తరచుగా తగిన విరామం లేకుండా విధులు నిర్వర్తిస్తారు. దీనివల్ల ఒత్తిడి, ఏకాగ్రత కోల్పోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని ఎంపీకి విన్నవించారు. విశాఖపట్నం దుర్ఘటనపై ఇటీవలి విచారణతో సహా అనేక నివేదికలలో రైల్వే ఈ వాస్తవాన్ని అంగీకరించింది.
READ MORE: Punjab: శివసేన నాయకుడిపై కత్తులతో దాడి.. పట్టించుకోని జనాలు
Also Read
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
- Astrology: జూలై 20 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
వరుసగా రెండు రాత్రులు డ్యూటీ చేసిన తర్వాత ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవాలని, రైళ్లలో డ్రైవర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని లోకో పైలట్లు కోరారు. లోకో పైలట్ల రిక్రూట్మెంట్ను ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో సిబ్బంది కొరతే విశ్రాంతి లేకపోవడానికి కారణమన్నారు. వారి సమస్యలు విన్న రాహుల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ వివరాలను కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో గత నాలుగేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క లోకో పైలట్ను కూడా నియమించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. “రైల్వేలను ప్రైవేటీకరించడానికి మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి పైలట్లు భయపడ్డారు. రైల్వేల ప్రైవేటీకరణ, రిక్రూట్మెంట్ లేకపోవడం వంటి అంశాలను తాను నిరంతరం లేవనెత్తుతున్నానని రాహుల్ గాంధీ లోకో పైలట్లకు హామీ ఇచ్చారు. అతను వారి సమస్యలను విన్నారు. తగినంత విశ్రాంతి కోసం వారి డిమాండ్కు పూర్తిగా మద్దతు ఇచ్చారు. దీంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.” అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పేర్కొంది.
తాజావార్తలు
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
-
FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
-
US – Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్ ఓటమి.. రోహిత్ సెంచరీ వృథా.. వన్డే సిరీస్ కూడా పాయే!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!