Rahul Gandhi: లోకో పైలట్లతో రాహుల్ సమావేశం..తరచూ రైలు ప్రమాదాలకు కారణాలు ఇవే..?
- లోకో పైలట్ల బాగోగులను అడిగి తెలుసుకున్న రాహుల్
- సమావేశానికి దేశ నలుమూలల నుంచి 50 మంది లోకో పైలట్లు
- ప్రమాదాలకు గల కారణాలు తెలిపిన లోకో పైలెట్లు
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకో పైలట్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను కూడా విన్నారు. ఈ సమావేశానికి సంబంధించి, రాహుల్ గాంధీ భారతదేశం నలుమూలల నుంచి 50 మంది లోకో పైలట్లను కలిశారని కాంగ్రెస్ తెలిపింది. వారు ఆయనకు తన సమస్యలు చెప్పుకున్నారు. లోకో పైలట్లు తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వారు ఇంటి నుంచి దూరంగా సుదూర ప్రాంతాలకు రైళ్లను నడుపుతారు. తరచుగా తగిన విరామం లేకుండా విధులు నిర్వర్తిస్తారు. దీనివల్ల ఒత్తిడి, ఏకాగ్రత కోల్పోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని ఎంపీకి విన్నవించారు. విశాఖపట్నం దుర్ఘటనపై ఇటీవలి విచారణతో సహా అనేక నివేదికలలో రైల్వే ఈ వాస్తవాన్ని అంగీకరించింది.
READ MORE: Punjab: శివసేన నాయకుడిపై కత్తులతో దాడి.. పట్టించుకోని జనాలు
Also Read
వరుసగా రెండు రాత్రులు డ్యూటీ చేసిన తర్వాత ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవాలని, రైళ్లలో డ్రైవర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని లోకో పైలట్లు కోరారు. లోకో పైలట్ల రిక్రూట్మెంట్ను ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో సిబ్బంది కొరతే విశ్రాంతి లేకపోవడానికి కారణమన్నారు. వారి సమస్యలు విన్న రాహుల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ వివరాలను కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో గత నాలుగేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క లోకో పైలట్ను కూడా నియమించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. “రైల్వేలను ప్రైవేటీకరించడానికి మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి పైలట్లు భయపడ్డారు. రైల్వేల ప్రైవేటీకరణ, రిక్రూట్మెంట్ లేకపోవడం వంటి అంశాలను తాను నిరంతరం లేవనెత్తుతున్నానని రాహుల్ గాంధీ లోకో పైలట్లకు హామీ ఇచ్చారు. అతను వారి సమస్యలను విన్నారు. తగినంత విశ్రాంతి కోసం వారి డిమాండ్కు పూర్తిగా మద్దతు ఇచ్చారు. దీంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.” అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పేర్కొంది.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో