Commander Manoj Katiyar: పాకిస్థాన్ ఖయ్యానికి కాలు దువ్వుతోంది.. లెఫ్టినెంట్ జనరల్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Commander Manoj Katiyar: పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదని, పాకిస్థాన్ కావాలనే యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తోందని వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ తెలిపారు. శాంతి కోసం భారత్ ఎన్నిసార్లు ప్రయత్నించినా, పాకిస్థాన్ స్నేహబంధాలను కోరుకోవడం లేదని అన్నారు. ఢిల్లీలోని మానెక్షా సెంటర్లో జరిగిన వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ సైన్యానికి శాంతి అవసరం లేదని, శాంతి వస్తే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే భయంతోనే ఉద్రిక్తతలను పెంచుతున్నారని కటియార్ వ్యాఖ్యానించారు. భారత్తో నేరుగా యుద్ధం చేసే ధైర్యం, సామర్థ్యం పాకిస్థాన్కు లేదని, అందుకే ప్రత్యక్ష యుద్ధం కాకుండా ప్రాక్సీ యుద్ధాలపై ఆధారపడుతోందని చెప్పారు.
READ MORE: Ananya Nagalla : టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలను గుర్తించరు: అనన్య
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
పాకిస్థాన్కు ఉగ్రవాదమే ప్రధాన ఆయుధమని తీవ్రంగా విమర్శించారు. భారత్ను క్షీణింపజేయాలనే పాకిస్థాన్ అనుకుంటోంది. ఉగ్రదాడులు, కుట్రలే వారి వ్యూహంగా పెట్టుకుందని తెలిపారు. పహల్గాం వంటి ఉగ్ర ఘటనలు భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ రూపొందించిన పథకాలలో భాగమేనన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికులు చూపిన అసాధారణ ధైర్యానికి అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఉగ్రవాద లాంచ్ప్యాడ్లు, శిబిరాలు, స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పారు. పాకిస్థాన్ ఈ దెబ్బ నుంచి అయినా పాఠం నేర్చుకుంటుందని ఆశిస్తున్నానని, అయితే నిర్లక్ష్యం చేయడానికి మాత్రం ఆస్కారం లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే ఏ ఘర్షణ అయినా పరిమితంగా ఉండకపోవచ్చని కటియార్ స్పష్టం చేశారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్థాన్ తన దేశంలోని రాజకీయ, సైనిక సంక్షోభాల నుంచి దృష్టి మళ్లించేందుకు కొత్త సాహసాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. భారత్ను మతాల పేరుతో విభజించాలన్నదీ శత్రువు కుట్రల్లో ఒకటని అన్నారు. పాకిస్థాన్ నాయకులు ఇంకా రెండు జాతుల సిద్ధాంతం భాషనే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే అప్రమత్తతతో పాటు జాతీయ ఐక్యత అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!