Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Mobile Tariff Hike India 2026 Jefferies Report

Recharge Price Hike: సామాన్యలకు బిగ్‌షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు..

Published Date :January 11, 2026 , 10:52 am
By RAMAKRISHNA KENCHE
Recharge Price Hike: సామాన్యలకు బిగ్‌షాక్.. భారీగా పెరగనున్న మొబైల్  రీచార్జ్ ధరలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Recharge Price Hike: సామాన్యులకు మరో బిగ్‌షాక్ తగిలింది. టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మొబైల్ టారిఫ్‌లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెంపు 2026 జూన్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక వెల్లడించింది. గతంలో జరిగిన ధరల సవరణల ట్రెండ్‌కు ఇదే సరైన కాలమని ఆ నివేదిక పేర్కొంది. ధరలు పెరగడమే కాకుండా, దేశంలో డేటా వినియోగం వేగంగా పెరగడం, ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వైపు వినియోగదారులు మారడం వల్ల ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతూనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల టెలికాం కంపెనీల ఆదాయ వృద్ధికి బలమైన మద్దతు లభిస్తోంది.

READ MORE: LIC Bima Lakshmi Plan: మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ ప్లాన్.. నెలకు రూ.4,400 కడితే.. చేతికి రూ.16 లక్షలు..!

Also Read

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

2026లో జరిగే రీచార్జ్ ధరల పెంపు ప్రభావంతో 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగ ఆదాయం సుమారు 16 శాతం పెరుగుతుందని అంచనా. ఇది 2026లో 7 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు రెండింతలు. టారిఫ్‌లు 15 శాతం పెరిగితే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం కూడా 2027లో సగటున 14 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల కొత్త వినియోగదారుల చేరిక కొంత మందగించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. ధరల పెంపు ప్రభావం కంపెనీల వారీగా భిన్నంగా ఉండనుంది. రిలయన్స్ జియో తన సేవల ధరలను 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశముందని అంచనా. దీని ద్వారా భారతి ఎయిర్‌టెల్‌తో సమానంగా తన విలువను నిలబెట్టుకోవడం, పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా పరిస్థితి మరింత కఠినంగానే ఉంది. భారీ ప్రభుత్వ బకాయిలను తీర్చేందుకు 2027 నుంచి 2030 మధ్య కాలంలో మొత్తం మీద సుమారు 45 శాతం వరకు సేవల ధరలు పెంచాల్సిన పరిస్థితి రావొచ్చని అంచనా.

READ MORE: Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి చాలా ప్రత్యేకం.. సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బ్రేక్ అయ్యేనా?

ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు చెందిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ బకాయిలు 2032 నుంచి చెల్లించడం ప్రారంభించి 2041 వరకు కొనసాగనున్నాయి. ఐదేళ్ల పాటు మోరేటోరియం అమలైతే తక్షణ నగదు భారం కొంత తగ్గినా, నెట్‌వర్క్ పెట్టుబడులను కొనసాగించేందుకు కంపెనీకి ఇంకా భారీగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 5జీ నెట్‌వర్క్‌ల నిర్మాణం ప్రధాన దశ పూర్తవుతున్న నేపథ్యంలో, టెలికాం కంపెనీల ఖర్చులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని అంచనా. 2027 వరకు పెట్టుబడి ఖర్చులు నియంత్రిత స్థాయిలోనే కొనసాగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, రాబోయే టారిఫ్ పెంపు టెలికాం రంగానికి ఆదాయ పరంగా కొత్త ఊపునివ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5G impact telecom revenue
  • ARPU growth telecom India
  • Jio Airtel Vodafone Idea tariff increase
  • Mobile tariff hike 2026 India
  • Prepaid to postpaid shift India

తాజావార్తలు

  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..

  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

  • Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి?

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!

ట్రెండింగ్‌

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions