భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఇంటి బయటకు రాకూడదని అంటారు. అలా వస్తే ఏ జరుగుతుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్ర భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఏం జరిగిందంటే?
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను […]
ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఓ సబ్ఇన్స్పెక్టర్ యువకుడిని బెల్టుతో కొడుతున్న వీడియో వైరల్గా మారింది. ఇందులో మహేవా అవుట్పోస్ట్ సబ్-ఇన్స్పెక్టర్ జగదీష్ భాటి ఔట్పోస్ట్లో ఒక యువకుడిని బెల్టుతో కొట్టడం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ను తక్షణమే లైన్లోకి పంపారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ గురువారం వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. 2024లో వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. ద్రవ్యోల్బణం ఇప్పుడు నియంత్రణలోకి వస్తుందని ఫెడ్ అభిప్రాయపడింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై 48 గంటలు కూడా గడవని తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారతీయుల్లో ఒకరితో మరొకరు బాధలు, సంతోషాలు పంచుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే వస్తువులను కూడా పంచుకుంటాం. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం...
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్లో ఒక భవనం కూలినట్లు చూడొచ్చు. బెంగళూరులోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో కొన్ని సెకన్ల వ్యవధిలో భవనం నేలమట్టమైంది. స్థానికుల కథనం ప్రకారం.. భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా భవనంలో భారీ పగుళ్లు పడ్డాయి.
ఉత్తరప్రదేశ్లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రతి జంట జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన క్షణం. ప్రతి జంట కూడా తమ జీవితంలోని ఈ చిరస్మరణీయ క్షణాన్ని బంధువులతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్లో పెళ్లికి సంబంధించి ఓ విచిత్ర ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఇద్దరు జంట ఆన్లైన్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవడానికి వరుడి బాస్ కారణం. టర్కీలో నివసిస్తున్న ఒక […]
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.
మధ్యప్రదేశ్లోని రేవాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సమోసాలో బల్లి కనిపించడంతో ఇక్కడ కలకలం రేగింది. దీంతో ఐదేళ్ల చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. నిజానికి.. సమోసా తిన్న తర్వాత రేవాలోని 5 ఏళ్ల చిన్నారికి వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారి కుటుంబం హోటల్ యజమానిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.