Congress vs BJP: బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BJP: తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన చేపట్టారు. దీంతో గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నో వాలో వచ్చారు.. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బారికేడ్ లకు ఇటువైపు బీజేపీ కార్యకర్తలు నిలబడ్డారు.. బీజేపీ నేతల చేతిలో కర్రలు ఉండటం ఉద్రిక్తతకు దారి తీసింది.
Also Read
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని.. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసు విషయంలోనూ అదే జరిగిందని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెప్తామన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది. గాంధీ పేరుని సైతం తొలిగిస్తుందన్నారు. న్యాయం గెలివడానికి సమయం పట్టొచ్చు.. కానీ చివరికి గెలిచేది న్యాయమే.. నేషనల్ హెలర్డ్ పేపర్ గురించి బీజేపీకి ఏమి తెలియదు.. మా మార్గమే అహింస మార్గం.. అలాగే శాంతుయుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని వెల్లడించారు. మరోవైపు.. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.. “రాహుల్, సోనియా గాంధీ పై బీజేపీ అక్రమ కేసు లు పెడుతుంది. ఢిల్లీ కోర్టు లో ఈడీ వేసిన ఛార్జిషీట్ ని కొట్టివేసింది. స్వాతంత్ర్యం నుంచి ఉన్న పేపర్ నేషనల్ హెరాల్డ్. దేశ కోసం ఆస్తులు త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబంపై కావాలనే బీజేపీ వేధింపులకు గురి చేస్తుంది. ఇదే అంశాన్ని మేము ప్రజలోకి తీసుకెళ్తాం.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!