Union Budget 2026: నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్లో భాగంగా ఆమె పార్లమెంట్లో ప్రసంగిస్తున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. “దేశ సంస్కరణల రైలు ఆగలేదు.. వేగంగా ముందుకెళ్తూనే ఉంది” అని చెప్పుతూ.. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకే మొదటి ప్రాధాన్యం ఇస్తోందని మరోసారి స్పష్టం చేశారు. తొమ్మిదోసారి ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026ను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మార్గపటంగా వివరించారు. టెక్నాలజీలో ముందంజ, తయారీ…
Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతున్నారు. భారత లక్ష్యాలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నామని చెప్పారు.. ఈ బడ్జెట్ ‘యువశక్తి బడ్జెట్’ అని ప్రస్తావించారు. నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కర్తవ్యాలను సాధిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మూడు కర్తవ్యాలను…
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. నేటి నుంచి సిగరెట్, పాన్మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, పొగాకు వాడకాన్ని తగ్గించటం లక్ష్యంగా ఈ మార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇంతవరకు ఈ ఉత్పత్తులపై 28 శాతం పన్నుతో పాటు జీఎస్టీ వచ్చినప్పుడు పెట్టిన ప్రత్యేక పరిహార…
Union Budget 2026 live Updates: నేడు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశం మొత్తం ఢిల్లీలోని పార్లమెంట్ వైపు చూస్తోంది. ఈ బడ్జెట్పై అంచనాలు చాలా ఉన్నాయి. జీతం పొందే ఉద్యోగులు ట్యాక్స్ తగ్గింపులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులు కొంచెం తేలిక అవుతాయా? అని ఆశిస్తున్నారు. గ్రామాలు, రైతులు తమకు మళ్లీ ప్రాధాన్యం దక్కుతుందా? అని చూస్తున్నారు.
Union Budget 2026: మరికొన్ని నిమిషాల్లో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫుల్గా ప్రిపేర్ అయ్యారు. ఆమె వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో కస్టమ్స్ సంస్కరణలు, ఆర్థిక లోటు నియంత్రణలో తదుపరి దశపై మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ బడ్జెట్కు సంబంధించి మనం ఏం గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Budget 2026 Expectations: నేడు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రపంచంలో ఉద్రిక్తతల మధ్య ఈ బడ్జెట్ కొనసాగుతోంది. ఈసారి బడ్జెట్పై దేశమంతా ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. చరిత్రలో తొలిసారి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఏమి ప్రకటిస్తారో అన్న ఉత్కంఠతో సామాన్యుడు నుంచి రైతు వరకూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ నుంచి ముందు వరుసలో ఉన్న ఆశలు విద్య, ఉద్యోగాల గురించే. పిల్లలు…
Union Budget 2026-27: నేడు కేంద్రం 2026-2027 ఏడాదికి పద్దును ప్రవేశపెట్టనుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే పెద్ద సంస్కరణలు, కీలక విధాన నిర్ణయాలు అన్నీ ఒకే రోజున ప్రకటించే వేదికగా ఉండేది. పన్నులు, ప్రభుత్వ పథకాలకు కేటాయింపులతో పాటు దేశ దిశను మార్చే నిర్ణయాలు బడ్జెట్లోనే వినిపించేవి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు సంస్కరణలు, ఖర్చుల నిర్ణయాలు ఏడాది పొడవునా విడివిడిగా వస్తున్నాయి. బడ్జెట్ ఒక్క రోజుకే పరిమితం కావడం లేదు. అందుకే ఈసారి బడ్జెట్ను అర్థం చేసుకునే…
Budget 2026 Expectations: దేశం మొత్తం ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై ఎంతో మంది ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ 2026 భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలవబోతోంది. బడ్జెట్ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం దాకా పార్లమెంట్లో జరిగే ప్రసంగం దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఈసారి బడ్జెట్ ఒక మధ్య దశలో వస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం విస్తృతంగా ఖర్చు చేసే బడ్జెట్ ఇచ్చింది. మరోవైపు త్వరలోనే…
Ishan Kishan: తిరువనంతపురం వేదికగా గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాట్తో ఊచకోత మొదలుపెట్టి, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్, కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒక్కో షాట్ ను అభిమానులు ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్లో ఇషాన్ తన కెరీర్లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు…
Janasena Party: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. అంబటి రాంబాబు అహంకారపూరిత వ్యాఖ్యలపై, అసభ్యకర బూతులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. "వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాత్తు శ్రీవారి సొమ్ము రూ. 250 కోట్లు దోపిడీ చేయడమే కాకుండా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో ఆవు నెయ్యి బదులుగా, 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడటమే కాకుండా, SIT రిపోర్ట్ ద్వారా 36…