Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explained: ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి ఈ85 (E85) ఇంధన పంప్ ప్రారంభం కావడంతో భారత్ ఇథనాల్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రస్తుతం రాజధాని నగరంలో లీటర్ ఈ20 పెట్రోల్ ధర సుమారు రూ. 102 పలుకుతుండగా, ఈ కొత్త ఈ85 ఇంధనాన్ని లీటరు రూ. 82.12 కే అందిస్తున్నారు. అంటే ఈ టీ20 పెట్రోల్ కంటే ఇది లీటరుకు ఏకంగా రూ. 20 చౌకగా లభిస్తోంది. పైకి చూసేందుకు ఈ ధరల వ్యత్యాసం చాలా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, కేవలం ఇంధనం ధర తక్కువగా ఉన్నంత మాత్రాన ఈ ప్రయోగం విజయవంతం కాదు. ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయల్ కింగ్గా పేరుగాంచిన బ్రెజిల్ అనుభవాలు మనకు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్లో ఏం జరిగింది?
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ (Flex-fuel) మార్కెట్గా బ్రెజిల్కు గుర్తింపు ఉంది. అక్కడ చెరకు ఆధారంగా ఇథనాల్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ, పెట్రోల్ లేదా ఇథనాల్.. ఇలా దేనితోనైనా నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహించేలా ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ప్రస్తుతం బ్రెజిల్లో అమ్ముడవుతున్న మెజారిటీ కొత్త కార్లు ఈ సాంకేతికతతోనే వస్తున్నాయి. అయితే, బ్రెజిల్ మోడల్ విజయవంతం కావడానికి కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే కారణం కాదు. ఇథనాల్ ఇంధనం వినియోగదారులకు స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాన్ని (పొదుపును) అందించడమే అసలు రహస్యం.
Also Read
- Gen Z: 'జెన్ జీ... మమ్మల్ని క్షమించు..'! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
- Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
70 శాతం నియమం ఏంటి?
బ్రెజిల్ వాహనదారులు ఇథనాల్ వాడేటప్పుడు ఒక కీలకమైన 70 శాతం నియమాన్ని (70 per cent rule) పాటిస్తారు. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో శక్తి సాంద్రత (Energy density) తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇథనాల్తో నడిచే వాహనాలు లీటరుకు ఇచ్చే మైలేజ్, పెట్రోల్ వాహనాల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇథనాల్ ధర పెట్రోల్ ధరలో 70 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది వాహనదారులకు ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది. అక్కడి ప్రభుత్వం సైతం ఇదే స్థాయిలో రేట్లను కొనసాగిస్తూ వస్తోంది. కానీ.. ప్రస్తుత ఢిల్లీ ధరల ప్రకారం చూస్తే, ఈ85 ధర (రూ. 82.12) పెట్రోల్ ధరలో సుమారు 80 శాతంగా ఉంది. ప్రతి లీటరుకు రూ. 20 ఆదా అవుతున్నట్లు అనిపించినా మైలేజ్ విషయానికి వచ్చే సరికి ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే.. ఇథనాల్ ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల, పెట్రోల్ నుంచి ఈ85 కి మారినప్పుడు వాహనాల మైలేజ్ 20 నుంచి 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే, లీటరుపై ఆదా అవుతుందనుకున్న రూ. 20 లాభం కాస్తా మైలేజ్ నష్టంతో హరించుకుపోతుంది. కొన్ని సార్లు నష్టం కూడా జరుగుతుంది.
బ్రెజిల్ అనుభవం ఏం చెబుతోంది?
బ్రెజిల్ అనుభవం ప్రకారం.. ఇథనాల్ ధర పెట్రోల్ కంటే 30-35 శాతం తక్కువగా ఉన్నప్పుడే ప్రజలు దానిని ఎగబడి కొంటారు. కానీ ఆ వ్యత్యాసం 20-25 శాతానికి పడిపోతే, మైలేజ్ తగ్గిపోవడం వల్ల వచ్చే నష్టం ముందు ఈ తక్కువ ధర పెద్దగా ఆకర్షణీయంగా అనిపించదు. ఇప్పుడు ఢిల్లీలో ఇస్తున్న 20 శాతం తగ్గింపు, వాహనదారులను ఈ85 వైపు తిప్పుకోవడానికి సరిపోకపోవచ్చు. బ్రెజిల్ సూత్రం ప్రకారం చూస్తే.. పెట్రోల్ ధర రూ. 100 ఉన్నప్పుడు, ఇథనాల్ ధర రూ. 82 కాకుండా రూ. 70 కి అటుఇటుగా ఉంటేనే జనం దీనిపై ఆసక్తి చూపిస్తారు. ధరల సవాలు మాత్రమే కాదు, మౌలిక వసతుల కొరత కూడా మరో పెద్ద అడ్డంకి. బ్రెజిల్లో ఎక్కడ చూసినా ఇథనాల్ బంకులు అందుబాటులో ఉంటాయి. కానీ మనదేశంలో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 5,000 ఇథనాల్ బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం ఫ్లెక్స్-ఫ్యూయల్ బంకులు కానీ, ఆ వాహనాలు కానీ మార్కెట్లో చాలా అరుదుగా ఉన్నాయి. ఇది ‘కోడి ముందా-గుడ్డు ముందా’ అనే చందంగా మారింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా నెట్వర్క్ లేకపోతే వాహన తయారీ సంస్థలు ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లను భారీగా ఉత్పత్తి చేయలేవు. పోనీ కార్లు రోడ్ల మీద ఎక్కువగా లేనప్పుడు బంకుల యజమానులు ఇథనాల్ పంపుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు.
ఏది ఏమైనప్పటికీ.. ఈ85 ప్రయత్నం విఫలమవుతుందని అనుకోలేం. ఎందుకంటే ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, దేశీయ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి, ఇంధన భద్రతను సాధించడానికి భారతదేశానికి ఇథనాల్ చాలా వ్యూహాత్మకమైనది. దేశ ప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు ప్రారంభంలో తక్కువ పొదుపు లభించినా ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా, వినియోగదారులు ఎప్పుడూ ప్రభుత్వ ఆశయాల కంటే తమ జేబు గురించే ఆలోచిస్తారనేది బ్రెజిల్ నిరూపించిన సత్యం. ఈ85 కేవలం ఒక ప్రయోగంగా మిగిలిపోకుండా సాధారణ ప్రజల ఇంధనంగా మారాలంటే, అది పెట్రోల్ కంటే స్పష్టమైన ‘కాస్ట్-పర్-కిలోమీటర్’ ప్రయోజనాన్ని చూపించాల్సిందే. ప్రస్తుతానికైతే లీటరుకు రూ. 20 తగ్గింపు అనేది ఒక మంచి ఆరంభం. అయితే, మైలేజ్ లోటును అధిగమించి ఈ తగ్గింపు ఎంతవరకు నిలబడుతుందనేదే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ విప్లవ విజయాన్ని నిర్ణయిస్తుంది.
తాజావార్తలు
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
-
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
-
Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
-
SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
-
BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!