Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్లో ఒక సుదీర్ఘమైన, అత్యంత హుందాతనమైన అధ్యాయం ముగిసింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఆధునిక క్రికెట్ ‘ఫాబ్ ఫోర్’ (Fab Four)లో ఒకరైన కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాదిలోనే అతడు టీ20లకు గుడ్బై చెప్పగా, తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టే ఆయనకు చివరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్లో విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగులు చేశాడు. కివీస్ జట్టు 115 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, విలియమ్సన్ కెరీర్ మాత్రం అజరామరంగా నిలిచిపోతుంది. 378 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 48 శతకాలు, 6 ద్విశతకాలతో 19,346 పరుగులు సాధించి, న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కేన్ రికార్డు సృష్టించాడు.
ఇక, విలియమ్సన్ రిటైర్మెంట్ ప్రకటనపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నాడు. “ఇన్నాళ్ల ప్రయాణంలో ఒక ప్రత్యర్థి నుంచి మంచి స్నేహితుడిగా మారావు” అంటూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. 2008 అండర్-19 ప్రపంచకప్ నుంచి మొదలైన వీరిద్దరి ప్రయాణం, ఆ తర్వాత పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ను శాసించే స్థాయికి చేరింది. మైదానంలో గట్టి పోటీదారులుగా ఉన్నప్పటికీ, వెలుపల మాత్రం వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. “ఇన్నాళ్ల ప్రయాణంలో ఒక ప్రత్యర్థి నుంచి ఓ మంచి స్నేహితుడిగా మారావు. ఇన్నేళ్లుగా నువ్వు బ్యాటింగ్ చేయడం చూడటం, నీతో పోటీ పడటం నాకు దక్కిన గొప్ప ఆనందం. అంతకుమించి, మన మధ్య ఉన్న స్నేహం, ఆట, జీవితం గురించి మనం పంచుకునే ఆలోచనలను నేను ఎంతో గౌరవిస్తాను. మనం మాట్లాడుకున్న ప్రతిసారీ, కలుసుకున్న ప్రతిసారీ ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుగా దాచుకుంటాను. నీకు ఎప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను సోదరా. నువ్వు చేయాల్సిన బాధ్యతను అత్యద్భుతంగా పూర్తి చేశావు. ఇప్పుడు వీటన్నింటినీ ఆస్వాదిస్తూ, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో.. చాలా బాగా ని కర్తవ్యాన్ని పూర్తి చేశావు మిత్రమా… నీ అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది!” అని విరాట్ ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చాడు.
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
ఇక, క్రికెట్ ఆటగాడిగానే కాకుండా, ఒక లీడర్గానూ కేన్ విలియమ్సన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. 2016 నుంచి 2024 వరకు మూడు ఫార్మాట్లలో కివీస్ జట్టును నడిపించిన అతడు అత్యంత ప్రశాంతమైన కెప్టెన్సీ శైలికి మారుపేరుగా నిలిచాడు. కేన్ నాయకత్వంలో న్యూజిలాండ్ జట్టు రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్, మూడుసార్లు సెమీఫైనల్స్ చేరడమే కాకుండా.. 2021లో జరిగిన మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మైదానంలో ఎప్పుడూ చిరునవ్వుతో క్రీడాస్ఫూర్తిని చాటే విలియమ్సన్ వంటి ఒక జెంటిల్మన్ క్రికెటర్ సేవలను అంతర్జాతీయ క్రికెట్ ఖచ్చితంగా మిస్ అవుతుంది.
From an opponent to a friend over the years. It’s been a pleasure watching you bat and compete against you over so many years but more than that I value our friendship and shared perspectives on the game and beyond. I continue to cherish every time we speak or meet. Wishing you…
— Virat Kohli (@imVkohli) June 12, 2026
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!