ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంపై ఉగ్రదాడి బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్న మోడీ నేడు రెండు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. కాగా.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ ప్రయాణించే విమానం సాధారణ విమానం కాదు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ విమానం ఎంత ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా జనాభా 141.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. మన దేశంలో మధ్యతరగతి జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రకారం.. ప్రస్తుతం (2025) దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు.…
64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం మారబోతోంది. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకువస్తోంది. దీనిని రేపు అంటే గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇంతలో దాని ముసాయిదా బయటకు వచ్చింది. ఇది 600 పేజీలకు పైగా ఉంది. ఈ కొత్త చట్టం ఆదాయపు పన్ను చట్టం 2025 అని పిలుస్తారు. దీనిని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేయవచ్చు.
బ్రహ్మానందం ఈవెంట్లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. ఈమధ్య కొంతమంది అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కానీ తన ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య.
సూర్య ద్వి పాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. తమిళ్ లో "వారనమ్ అయిరమ్" పేరుతో తమిళ్లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన సినిమా.. తమిళ్ కంటే తెలుగులోనే హిట్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా ఫిబ్రవరి 14న ఈ ప్రేమికుల రోజు…
హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రముఖ పాత్రలో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘అగత్యా’. ఈ చిత్రాన్ని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్ పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉన్నట్లు యూనిట్ చెబుతోంది.
నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో.. చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలైంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా.. నేడు(ఫిబ్రవరి 11) హైదరాబాద్లోని ట్రిడెంట్ హోటల్ లో "తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ" ఈవెంట్ నిర్వహించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఎన్టీఏ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో మొత్తం 14 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఐదుగురు రాజస్థాన్కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని…
మోడీ ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ యోజనలో పెద్ద మోసం బయటపడింది. ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన రూ. 562.4 కోట్ల విలువైన 2.7 లక్షల నకిలీ క్లెయిమ్లను నేషనల్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 1,114 ఆసుపత్రులను ప్యానెల్ నుంచి తొలగించారు. దీనితో పాటు, ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 549 ఆసుపత్రులను నిలిపివేశారు.