Annual Income: మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత?.. మీ స్థాయి చెక్ చేసుకోండి..
- దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా
- అసలు మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత?
- దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్యతరగతి ప్రభావం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా జనాభా 141.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. మన దేశంలో మధ్యతరగతి జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రకారం.. ప్రస్తుతం (2025) దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. 2016లో ఇది 26 శాతంగా ఉండేది.
READ MORE: World’s Most Corrupt Country: ప్రపంచంలో అత్యంత “అవినీతి” దేశం ఇదే.. భారత్ స్థానం ఎంతంటే.?
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
అయితే.. మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. వాస్తవానికి భారతదేశంలో మధ్య తరగతి అంటే వార్షిక ఆదాయం రూ. 5లక్షలు- 30 లక్షల వరకు (2020-21 ధరల ఆధారంగా) ఉన్న వారని అర్థం. ఇంత కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు దిగువ మధ్యతరగతి కేటగిరీలోకి వస్తారు. ఒక వేళ 30 లక్షల కంటే ఎక్కువగా ఉంటే.. వారు ధనికులని అర్థం.. ఈ అంచనాలకు 2020-21 ధరల ఆధారంగా సూచించారు.
READ MORE: L&T Chairman: సంక్షేమ పథకాల వల్లే కార్మికులు దొరకడం లేదు..
ఇదిలా ఉండగా… ఈ మధ్యతరగతి జనాభా చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం. ఎలాగంటే.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్ కొరతను ఎదుర్కొంటోంది. వస్తు, సేవలను ఎక్కువగా వినియోగించే మధ్యతరగతి వారి చేతిలో డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి దెబ్బతింటోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గిపోయింది. వినియోగంలో తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తిలను పెంచడం లేదు. కొత్త పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతం. గత నాలుగేళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి. ఆర్థిక సర్వే 6.3 నుంచి 6.8 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. దీనిని మందగమనానికి సంకేతంగా పరిగణిస్తున్నారు.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!